హర్ ఏక్ మాల్, పాన్ డబ్బా: కవి అలీ మృతి
నల్లగొండ: నల్లగొండకు చెందిన ప్రముఖకవి మహ్మద్ అనీఫ్(అలీ) సోమవారం కన్నుముశారు. ఆయన వయసు 60 ఏళ్లు. నిరుపేద కుటుంబంలో మహ్మద్ గౌస్, జానీబేగం దంపతులకు 1956లో జన్మించిన అనీఫ్ డిగ్రీ చేసినా ఉద్యోగం దొరక్క పాన్డబ్బా పెట్టుకుని జీవనం సాగించారు.
అలీగా అందరికీ పరిచయస్థుడైన అనీఫ్ 'జీవితమే సాహిత్యం' అనే కలం పేరిట 1996లో సాహిత్య రంగంలోకి ప్రవేశించారు. 'పాన్మరక' అనే కవితలో తాను అనుభవించిన దుర్భర జీవితాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత ఉర్దూలో ఒక కథా సంపుటిని ప్రచురించారు. 2006లో ఉద్యమం సమయంలో 'సింహగర్జన' పేరుతో కవిత్వం రాశారు.
అలీ మృతికి కవులు అంబటి వెంకన్న, పున్న అంజయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, కొలనుపాక మురళీధర్రావు, అభిమానులు సంతాపాన్ని ప్రకటించారు.
నాలుగ్గీరల బండీ మీద హరేక్మాల్ అమ్మీ, ఆ జీవితాన్నే కథలుగా, కవితలుగా మలిచాడు. ఓ వైపు బతుకు పోరాటం చేస్తూనే, పిల్లల పెళ్లిల్లు చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఇస్లామిక్ స్టడీస్లో ఎంఏ జాయిన్ అయ్యాడు. పిహెచ్డి చేయాలనేది ఆయన తీరని కోరిక.
పేరుకు ముందు డాక్టర్తోటే చనిపోవాలన్న తన కోరిక నెరవేరకముందే అసువులు బాసిన అలీభాయ్ అకాలమరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని ప్రముఖ కవి పసునూరి రవీందర్ అన్నారు.