బెంగళూరుకు గుడ్ బై: రూటు మార్చిన RCB
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్లో తమ సొంత మ్యాచ్లను రెండు కొత్త స్టేడియాల్లో ఆడనుంది. భద్రత కారణాలతో హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్, ఛత్తీస్ గఢ్ రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియాలు ఇకపై ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లుగా మారనున్నాయి.
ఐపీఎల్ 2025 టైటిల్ సాధించిన తర్వాత బెంగళూరులో చోటు చేసుకున్న విషాదకర సంఘటనల నేపథ్యంలో ఫ్రాంఛైజీ మళ్లీ బెంగళూరుకు తిరిగి రావడానికి సుముఖత చూపడం లేదనే వార్తల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. వాస్తవానికి, ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుండి ఆర్సీబీ తన సొంత మ్యాచ్లన్నింటినీ చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతూ వస్తోంది. గత ఏడాది విజయోత్సవ వేడుకల అనంతరం స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.

ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన ఫ్రాంఛైజీతో పాటు సంబంధిత అధికారులపై తీవ్ర విమర్శలు, ప్రతికూల పరిస్థితులకు దారితీసింది. అప్పటి నుండి ఆర్సీబీ సొంత వేదిక మార్పులకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఐపీఎల్ 2026కి బెంగళూరులో మ్యాచ్లు నిర్వహించడానికి ఫ్రాంఛైజీ ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించడం గురించి ఇప్పటివరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ను సంప్రదించలేదని అంటున్నారు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో తన సొంత మ్యాచ్లను రెండు వేదికల్లో నిర్వహించడానికి ఆర్సీబీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో అయిదు, రాయ్పూర్లో రెండు మ్యాచ్లను ఆడేలా ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్టేడియాల్లో లాజిస్టికల్, ఆపరేషనల్ కార్యకలాపాల గురించి ప్రస్తుతం ఆర్సీబీ మేనేజ్మెంట్.. ఆయా నగరాల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
డీవై పాటిల్ స్టేడియం గతంలో పలు ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. రాయ్పూర్ స్టేడియంలో కూడా పలు అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా జరిగాయి. ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం వల్ల ఆర్సీబీ యాజమాన్యం ఈ రెండు స్టేడియాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఐపీఎల్ 2026లో తమ సొంత మ్యాచ్లను పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడనుంది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications