కామన్మినిమం బడ్జెట్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Thursday, July 08 2004
న్యూఢిల్లీ:మధ్యతరగతికి, గ్రామీణ రంగానికిఅనుకూలమైన బడ్జెట్ను ఆర్ధికమంత్రిచిదంబరం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు.తొంభైఏడులో లాగా ఆయన డ్రీం బడ్జెట్నుకాకుండా ప్రాక్టికల్ బడ్జెట్ను ఎంచుకున్నట్టుకన్పిస్తోంది. ఆదాయం పన్ను పరిమితిని లక్షరూపాయలకుపెంచడం వల్ల కోటీ నలభై లక్షల మందిమధ్యతరగతి వారికి మేలు జరిగింది.పారిశ్రామిక రంగానికి పెద్ద రాయితీలు ఇవ్వకపోయినాఈ రంగానికి ఇబ్బంది కలిగించే అంశాలను బడ్జెట్లోచేర్చలేదు.
మరమగ్గాలు, చేతి మగ్గాలఉత్పత్తులపై వాల్యూ యాడెడ్ టాక్సునుపూర్తిగా తొలగించడం మరో ముఖ్య అంశం.సంకీర్ణ ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమంలోనిఅంశాలు బడ్జెట్లో ప్రతిబింబించాయి. సర్వీసు టాక్సునుఎనిమిది నుంచి పదిశాతానికి పెంచడం వల్లప్రజల మీద భారం పడనుంది. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపుగా ఇన్సూరెన్సు,టెలికాం, ఎయిర్ లైన్సు రంగాల్లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల పరిమితిని పెంచారు. లాభాలు ఆర్జిస్తున్నఎన్టీపీసీలో ఐదుశాతం డిజిన్వెస్ట్ను ప్రకటించారు.
ఈబడ్జెట్లో ద్రవ్యలోటు స్ధూల జాతీయ ఉత్పత్తిలో4.4 శాతానికి పరిమితం చేసి లోటును 1,37,407కోట్ల రూపాయలుగా చూపించారు.
Recent Stories
సచిన్టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
