తెలంగాణవచ్చుడో, కెసిఆర్ చచ్చుడో
హోంపేజి టాక్ ఆఫ్ టుడే రాజకీయాలు Saturday, December 11 2004
హైదరాబాద్:తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ చచ్చుడోఅని టిఆర్ఎస్ అధ్యక్షుడుకె.చంద్రశేఖరరావు అన్నారు. ఇకమీదట తెలంగాణ ఉద్యమ సభలుజరగవని, తెలంగాణ రాష్ట్ర విజయోత్సవసభలు జరుగుతాయనిఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్సులో శనివారంసాయంత్రం జరిగిన ప్రజా గర్జన బహిరంగ సభలో ఆయనప్రసంగించారు. హరిత తెలంగాణ కోసంతాము కృషి చేస్తామని, తెలంగాణరాష్ట్రాన్ని పంజాబ్ తరహాలోవ్యవసాయికంగా అభివృద్ధి చేస్తామనిఆయన ప్రజల కరతాళ ధ్వనులమధ్య ప్రకటించారు. రక్తపాతరహితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని ఆయన అన్నారు.తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసంకృషి చేస్తున్నానని, తెలంగాణ రాష్ట్రంఏర్పాటయ్యాక తాను అన్ని పదవులకురాజీనామా చేస్తానని ఆయనప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడకుండా ఎవరైనా అడ్డుకుంటేఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చురగులుతుందని చంద్రశేఖరరావుఅన్నారు. తాము ఎన్నడూ హింసాయుతపద్ధతుల్లో తెలంగాణ ఉద్యమంనడపలేదని ఆయన అన్నారు.
తెలంగాణరాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు పుష్కలంగాప్రవహిస్తాయని, తెలంగాణ కరెంటు తీగల్లో రోజుకి ఇరవైనాలు గంటలు, నాణ్యమైన విద్యుత్ ప్రవహిస్తుందనిఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడిన తర్వాత తానురాజకీయాలనుంచి తప్పుకుని కాపలాకుక్కలా ఉంటానని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినతర్వాత నక్సలైట్లతో చర్చలుకొనసాగుతాయని ఆయన అన్నారు.
- తారల ప్రభావం నిల్!
- ఉద్వేగ అంశాలు
- తారల ప్రభావం నిల్!
-
ఇప్పటికిప్పుడు
చెరిసగం
- పార్టీ టికెట్ల మార్కెటింగు
-
చిరంజీవి
రహస్య
ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం
- కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్
- పార్టీ టికెట్ల మార్కెటింగు
-
చిరంజీవి
రహస్య
ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం