గూడు వీడేందుకే...
హైౖదరాబాద్:రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు అధిష్టానవర్గానికిఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తుపెట్టుకుంటే ఘన విజయంసాధిస్తామని అధిష్టానవర్గం వద్దబీరాలు పలికిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకుఇప్పుడు మొహం చెల్లడం లేదు. శివశంకర్,నాగేందర్ వంటి బిసి నాయకులు పార్టీ విడిచిపోవడంవల్ల బలహీనవర్గాల్లో పార్టీకి వ్యతిరేకప్రభావం ఉంటుదేమోనని అగ్రనాయకత్వంఆందోళన చెందుతోంది. పరిస్ధితుల చక్కదిద్దడానికిగురువారం హైదరాబాద్ వచ్చిన ఎఐసిసిపరిశీలకుడు వాయలార్ రవి ముఖ్యనాయకులందరితోసమావేశమయ్యారు. తిరుగుబాటు అభ్యర్ధులతోఆయన మాట్లాడారు.
తెరాసకుఎక్కువ సీట్లే ఇచ్చామని నిన్న ప్రణబ్ ముఖర్జీనేడు, రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.డి.శ్రీనివాస్, కెసిఅర్ ల మధ్యరహస్య అవగాహన ఫలితంగానే ఇలాజరిగిందని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు.మెదక్ జిల్లాలో బాగారెడ్డి తదితరులుతెలంగాణ కాంగ్రెసు పేరిట వేరు కుంపటిపెట్టుకున్నారు. అసమ్మతులు అన్ని పార్టీల్లో ఉన్నాకాంగెసులో ఎక్కువగా కన్పిస్తున్నాయి.
కాంగ్రెసునాయకుల ఢిల్లీ యాత్రలు, మాటిమాటికీఆజాద్ వంటి పరిశీలకుల పెత్తనం,నాయకుల మధ్య కీచులాటలు ప్రజలకుతప్పుడు సంకేతాలు పంపుతున్నాయి.వైఎస్, డిఎస్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగాఉన్నాయి. మరోపక్క దాసరి నారాయణరావుపార్టీలో లోపాల గురించి సోనియాగాంధీకి సుదీర్ఘలేఖ రాశారు. పది అసెంబ్లీ స్ధానాల్లో కాంగ్రెసుఅభ్యర్ధులను మార్చే అవకాశం ఉందనితెలిసింది.
-
చిరంజీవిరహస్య
ఎజెండా?