Home
హోంపేజి టాక్ ఆఫ్ టుడే కాంగ్రెస్ Thursday, July 01 2004
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రజల కారణంగానే కేంద్రంలోకాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందన్నసెంటిమెంటు ప్రధాని మన్మోహన్ సింగ్కుఉండడం వల్లనే ఆయన ప్రధానిగా తొలిపర్యటనకు మన రాష్ట్రాన్ని ఎంచుకున్నారు.ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబసభ్యులనుపరామర్శించి, వారికి అక్కడికక్కడే ఆర్ధికసాయం అందించారు. నిజాయితీకి, నిరాడంబరతకుమారుపేరైన మన్మోహన్ నేడు మానవత్వాన్నికూడా చూపెట్టారు. రైతుల కుటుంబ సభ్యులతోఆయన మాట్లాడిన తీరులో ఏమాత్రం అతిశయంకన్పించలేదు.
ఆంధ్రప్రదేశ్లోఅన్నదాతల పరిస్ధితి ఇలా మారడం దురదృష్టకరమనిఆయన అన్నారు. తాను కూడా రైతు కుటుంబంలోపుట్టానని రైతుల బాధలను అర్ధం చేసుకోగలననిఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్కు అన్నిరంగాల్లో ఉదారంగా సాయం చేస్తానన్నధ్వని ఆయన మాటల్లో ఉంది. కేంద్రంలో రాష్ట్రంలోఒకే కూటమి అధికారంలో ఉండడం వల్ల రాష్ట్రానికిమొదటి నుంచి కాస్తా కూస్తో ఉపశమనంకలుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడుఎన్డీయే ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కావాల్సినతక్షణ సాయాలు పొందినట్టే ఇప్పటి రాష్ట్రకాంగ్రె స్ కూడా కేంద్రం నుంచి సహాయాలనుతేలికగా రాబట్టుకోగలదు. ఈ సంవత్సరంకూడా తగినంత వర్షాలు కురిసే అవకాశంలేదని వార్తలు వస్తున్న సమయంలో కేంద్రసాయం పెద్ద రిలీఫ్.
- మీనాఎందుకు?
- రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
- గులాబీపోరు!
- నెలరాజు వైఎస్
- మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
- ఎవరు గొప్ప?
- ఆచితూచి అడుగులు
- సవాళ్ళు ఎన్నో...