లక్కీహైదరాబాద్
హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో అమెరికన్కాన్సులర్ కార్యాలయం ఏర్పాటు చేయడం దాదాపుఖాయమైనట్టే. ఈకార్యాలయం కోసం బెంగుళూరుతోపోటీపడి హైదరాబాద్సఫలీకృతమైంది. చెన్నై నుంచివచ్చిన అమెరికన్ అధికారుల బృందంహైదరాబాద్ నగరంలో కాన్సులర్కార్యాలయం ఏర్పాటు చేయడానికి మూడుప్రదేశాలను గుర్తించినట్టు తెలుస్తోంది.చెన్నైలోని యుఎస్ కాన్సులర్ జనరల్హూపర్ గురువారం నగరానికి వచ్చిఅనువైన స్ధలాన్ని ఎంపిక చేస్తారు.
కాన్సుల్కార్యాలయానికి బెంగుళూరు కంటేహైదరాబాద్ ఎందుకు అనువైనదిగామారింది? చెన్నై నుంచి బెంగుళూరుహైదరాబాద్ కంటే తక్కువ దూరంలో ఉంది.బస్సులో గానీ, రైలులో గానీవెళితే బెంగుళూరు నుంచి ఆరుగంటల్లోచెన్నైకి వెళ్తారు. అదే హైదరాబాద్నుంచి చెన్నైకి పన్నెండు గంటలుపడుతుంది. బెంగుళూరులోని అభ్యర్ధులుదగ్గరలో ఉన్న చెన్నైకివెళ్ళి వీసా పొందవచ్చు. అదేహైదరాబాద్ వాసులకు చెన్నైవెళ్ళడం వ్యయ ప్రయాసలతో కూడినపని. కాన్సుల్ కార్యాలయంహైదరాబాద్ను వరించడానికి ఇదేప్రధాన కారణం. మరో కారణం వీసా దరఖాస్తులుబెంగుళూరు కంటేహైదరాబాద్ నుంచే ఎక్కువ. చెన్నైకాన్సుల్ కార్యాలయం నుంచి జారీ అవుతున్న వీసాలలో దాదాపుయాభైశాతంఆంధ్రప్రదేశ్వే.
బంజారాహిల్స్లోనిఒక ఫైవ్ స్టార్ హోటల్ను కాన్సుల్కార్యాలయం ఏర్పాటు చేయడానికి హూపర్పరిశీలిస్తారు. సైబరాబాద్లో శాశ్వతకాన్సుల్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనకూడా ఉంది. శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్ కంటేబెంగుళూరు మెరుగైనప్పటికీఅనేక కారణాల వల్ల హైదరాబాద్ఎంపికైంది. హైదరాబాద్లో కాన్సుల్కార్యాలయం ఏర్పాటు అయ్యేలా గత చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృషి చేసింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆకృషిని కొనసాగించి విజయం సాధించింది.