పట్టు బిగిస్తున్న బాలకృష్ణ

బాలకృష్ణ వియ్యంకుడైనందువల్ల, ఆడపిల్ల తండ్రిగా ఆయన తనకు ఏకు మేకు అయ్యే అవకాశం లేదని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ పరిస్ధితులు క్రమంగా చేతులు దాటిపోయే అవకాశం లేకపోలేదు. గుంటూరు సభలో తన ప్రసంగం సూపర్ హిట్ అయిన దగ్గర నుంచి బాలకృష్ణలో నాయకుడు నిద్ర లేచినట్టు కన్పిస్తోంది. చంద్రగిరి టికెట్ ను రోజాకు ఇవ్వాలని బాబు అనుకుంటుండగా, నారా రామ్మూర్తి నాయుడికి ఇప్పించాలని బాలయ్య భావిస్తున్నారు.
బాలకృష్ణకు తన తండ్రికి ఉన్నంత ఆవేశం, పట్టుదల ఉన్నాయి. ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన వెనక్కి పోయే రకం కాదు. హరికృష్ణ అయినా కుటుంబ సమైక్యతను ఆశించి చంద్రబాబు సర్దుకుపోవచ్చు కానీ బాలయ్య అలా కాదు. అదీ కాకుండా ఒక బలమైన కులం ఆయనను ముఖ్యమంత్రి చూడాలని ఆశిస్తోంది. ఆ కుల పెద్దలు ఈ దిశగా పావులు కదపడానికి డిన్నర్ మీటింగులు పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ ఇప్పటికే పార్టీ సంస్ధాగత అంశాలపై పట్టు సాధించగా, ప్రధాన ప్రచారకుడిగా బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడిని అవసరమైతే జాతీయ రాజకీ యాల్లోకి పంపించి, బాలయ్యకు ఇక్కడ పట్టాబిషేకం చేయడానికి కులపెద్దలు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలయ్య స్పష్టంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications