పిసిసి రేసులో కెవిపి?

అంతేకాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. అధిష్టానం అంచనాల మేరకు కిరణ్ రాణించక పోవడంతో పార్టీ ఆయన పట్ల విముఖతతో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయనను మార్చితే మరోసారి కాంగ్రెసు ముఖ్యమంత్రులను మార్చే పార్టీగా అపవాదును తలకెత్తుకోవాల్సి వస్తుందని ఆగిపోయింది. అంతేకాదు ముఖ్యమంత్రి కిరణ్ పట్ల సీనియర్ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో ఒంటెత్తు పోకడలకు వెళుతున్నాడని విమర్శలు ఉన్నాయి. పరిపాలనలో సీనియర్ల సలహాలు కూడా తీసుకోవడం లేదని పార్టీ సీనియర్లు, మంత్రులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు కూడా సిఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ సిఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా సిఎంపై విమర్శలు కురిపించారు. అటు పాలనలో, ఇటు పార్టీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్కు, అటు ప్రత్యర్థి వైయస్ జగన్కు చెక్ చెప్పాలంటే అందరితో మమేకం అయ్యే కెవిపే అందుకు సరియైన అభ్యర్థి అని అధిష్టానం కూడా భావించి పీఠం అప్పగించే నిర్ణయంపై తీవ్రంగా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కెవిపి ద్వారా సంక్షోభాన్ని నివారించవచ్చా అనే విషయంపై పార్టీ ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
రోశయ్య సోనియాను కలవడానికి ముందు, కలిసిన అనంతరం కెవిపిని కలవడం, కెవిపి కూడా వారం రోజులుగా న్యూఢిల్లీలోనే మకాం వేయడాన్ని బట్టి కూడా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నమ్మడానికి ఆధారాలుగా లభిస్తున్నాయి. కెవిపి కూడా ఢిల్లీలోనే మకాం వేసి పీఠంపై కూర్చోవడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి కూడా. ఇప్పటికే పిసిసి పదవి రేసులో బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీ నారాయణ, దామోదర రాజనర్సింహ తదితరుల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా వినబడుతున్న కెవిపి పేరే చివరకు ఖాయమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. పిసిసి పీఠంపై కూర్చోవడానికి ఎవరికి వారు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఎవరికి ఇచ్చినా మరొకరు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే కెవిపికి ఇస్తే మాత్రం మిగిలిన వారు ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేదని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications