జగన్ కేసు: పారని విజయ సాయి రెడ్డి స్కెచ్

విచారణ సమయంలో సాయి రెడ్డి సిబిఐ అడిగే ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా ఉండేవి కావు. ఈ విషయాన్ని అధికారులే స్పష్టం చేశారు. తాము రోజుల తరబడి విచారించినా ఆయన ఇచ్చిన సమాచారం అసంబద్ధంగా ఉందంటూ సిబిఐ, ఈడి దర్యాఫ్తు సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నిసార్లు విచారించినా సాయిరెడ్డి తమకు ఏమాత్రం సహకరించడం లేదని దర్యాఫ్తు నుండి ఎలా తప్పించుకోవాలో ఆయనకు తెలుసునని సిబిఐ న్యాయస్థానంలోనే స్పష్టం చేసింది. జగన్ కేసులో సిబిఐ పరిధి దాటుతోందంటూ ఆయన సిబిఐ ప్రత్యే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సాక్షులను ఒత్తిడి చేసి సిబిఐ బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. దర్యాఫ్తు నుండి తప్పించుకోవడానికే ఆయన పిటిషన్ ఎత్తుగడ వేశారని సిబిఐ కోర్టులో వాదించింది. ఆ తర్వాత న్యాయస్థానం ఆయన పిటిషన్ను కొట్టి వేసింది.
ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం సిబిఐ ఏర్పడిందని, దానిలోని ఒక నిబంధన కారణంగా రాష్ట్రాల కేసులను విచారించే అధికారం దానికి దాఖలు పడుతోందని, ఆ నిబంధనను రద్దు చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురే అయింది. ఇక వరుసగా మూడు రోజులపాటు ఈడి విచారణకు హాజరైనా ఆయన ఇచ్చిన జవాబులపై అధికారులు అసంతృప్తినే వ్యక్తం చేశారు. దీనితో దర్యాప్తును షెడ్యూలు కంటే పొడిగించింది కూడా. వీటికితోడు, తనకు ప్రాణ హాని ఉందంటూ సాక్షాత్తూ డిజిపికే ఆయన లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి, ఏదైనా కేసులో ఉన్న నిందితుడికి సెక్యూరిటీని కల్పించరు. కానీ, ఈ కేసులో సాయి రెడ్డికి మాత్రం భద్రత కల్పించారు. ఇలా దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి, దానిని జాప్యం చేయడానికి ఆయన ఎన్ని స్కెచ్లు వేసినా ఫలించనట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications