కెసిఆర్ పునాదులు కదులుతున్నాయా?

K Chandrasekhar Rao
తెలంగాణలోని ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పునాదులు కదులుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కెసిఆర్‌కు గానీ తెరాసకు గానీ వ్యతిరేకంగా ఏ వార్తాకథనం వచ్చినా అందులో సీమాంధ్ర కుట్ర ఉంటుందనేది ప్రధాన ఆరోపణగా ముందుకు వస్తోంది. నిజానికి, కెసిఆర్ అనుకున్నట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే, ప్రస్తుతం మాత్రం పరిస్థితి కెసిఆర్‌కు అంత అనుకూలంగా లేదనే మాట వినిపిస్తోంది. ఉప ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లో రెండు స్థానాల్లో తెరాసకు ఎదురు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాసనసభా సభ్యత్వానికి రాజీనామాలు చేసి తెరాసలో చేరిన ఇద్దరి పరిస్థితి స్థానికంగా అంత సజావుగా లేదని అంటున్నారు. తెలుగుదేశం నుంచి తెరాసలోకి వచ్చిన గంపా గోవర్ధన్ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలో ఎదురీదాల్సిన పరిస్థితే ఉందని చెబుతున్నారు. అలాగే, కాంగ్రెసు నుంచి తెరాసలోకి వచ్చిన టి. రాజయ్య పరిస్థితి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో అంత బాగా లేదని ప్రచారం సాగుతోంది. వీరిద్దరికి స్థానికంగా వ్యతిరేకంగా ఉందనే మాట వినిపిస్తోంది. అయితే, తాను ఇచ్చిన హామీ మేరకు కెసిఆర్ ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చలేరు. వారికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత కెసిఆర్‌పై ఉంది. ఆ బాధ్యతను ఆయన తీసుకుంటారనే అందరూ అనుకుంటున్నారు.

అలాగే, మహబూబ్‌నగర్ శానససభ నియోజకవర్గానికి సంబంధించి కూడా కెసిఆర్ ప్రయత్నాలు ఫలించడం లేదని అంటున్నారు. నిజానికి, స్థానిక శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి మరణించడం వల్ల దీనికి ఉప ఎన్నిక వస్తోంది. రాజేశ్వర రెడ్డి సతీమణిని కెసిఆర్ తెరాసలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే, ఆమె అందుకు సిద్ధపడడం లేదని సమాచారం. నిజానికి, ఈ సీటులో తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేత శ్రీనివాస గౌడ్‌ను పోటీకి దించాలని తెరాస నాయకత్వం భావించిందని అంటారు. రాజేశ్వర రెడ్డి సతీమణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తెరాసకు ఈ సీటును గెలుచుకోవడం కష్టమే అవుతుంది.

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలులో తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి తెరాస మద్దతు ప్రకటించాల్సి రావచ్చు. నాగం జనార్దన్ రెడ్డి తెరాసలోకి రావడానికి ఇష్టపడడం లేదు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని చెబుతున్నారు. తెలంగాణ కోసమే రాజీనామా చేశారు కాబట్టి నైతికంగా కెసిఆర్ ఆయనకు మద్దతు ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. నాలుగు సీట్లు అలా పోతే మిగిలింది ఆదిలాబాద్, కోల్లాపూర్ నియోజకవర్గాలు. ఈ సీట్లు తెరాసకు రావడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. బిజెపి దూరమయ్యే పరిస్థితి ఏర్పడడం, పోలవరం టెండర్ల విషయంలో కెసిఆర్ ఏదో మేరకు బద్నాం కావడం తెరాసకు వ్యతిరేకంగా పనిచేస్తాయని అంటున్నారు. ఏమైనా, ఆరు స్థానాల్లో ఎన్ని సీట్లు వచ్చినా అది తెరాసకు అదనమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+