వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స సత్తిబాబు ఎందుకు రెచ్చిపోయారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం అకస్మాత్తుగా ఎందుకు రెచ్చిపోయారనే విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని ఆయన సంచలన ప్రకటన చేశారు. అయితే, ఆ తర్వాత మాట మార్చినా ఆయన అంత అసహనంగా ఎందుకు మాట్లాడారనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చ సాగుతూనే ఉన్నది. ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనే ఉద్దేశం బొత్స ప్రకటన వెనక ఉందని భావిస్తున్నారు. చంద్రబాబు లాలూచీ పడ్డారని చెప్పడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనే విషయాన్ని ఆయన చెప్పదలుచుకున్నట్లు అనుకోవచ్చు. ఒక రకంగా చంద్రబాబుతో కుమ్మక్కయిన విషయాన్ని తాను పార్టీ అధిష్టానానికి చేరుస్తానని కిరణ్ కుమార్ రెడ్డికి పరోక్ష హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు.

పైగా, ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను దెబ్బ తీయడానికి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వాడుకుంటున్నారనే అభిప్రాయం ఆయనకు కలిగినట్లు చెబుతున్నారు. మద్యం సిండికేట్ల నివేదికను అడ్డు పెట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి తనను బెదిరిస్తున్నారని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది కాబట్టి మద్యం సిండికేట్లపై ఎసిబి సమర్పించిన నివేదికను బయట పెట్టక తప్పడం లేదనే పరిస్థితిని కల్పించడం కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశమని అంటున్నారు.

మద్యం సిండికేట్లపై ఎసిబి నివేదికను బయటపెడితే బొత్స సత్యనారాయణకు తిప్పలు తప్పవని అంటున్నారు. బొత్స సత్యనారాయణను దెబ్బ తీయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మద్యం సిండికేట్లపై శానససభా సమావేశాలను అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. తన పదవికి ఎసరు పెట్టాలని చూస్తున్న బొత్స సత్యనారాయణను ఆ విధంగా దెబ్బ తీయాలనే ఎత్తుగడలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ అంతగా రెచ్చిపోయారనే మాట వినిపిస్తోంది. తన ఆంతర్యాన్ని కిరణ్ కుమార్ రెడ్డికి చేరవేయడానికి మొదటి ప్రకటనను ఆయన ఉద్దేశించగా, రెండో ప్రకటనను తాను వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పుకోవడానికి చేసినట్లు భావిస్తున్నారు.

English summary
It is said that PCC president Botsa Satyanarayana made comment to convey his intention to CM Kirankuamar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X