జగన్పైనే గురి: ఎన్నికల్లో చంద్రబాబుతోనే పవన్ కల్యాణ్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి వెళ్లడానికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. తనతో పాటు వామపక్షాలను కూడా ఆయన తన వెంట తీసుకుని వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతారని అంటున్నారు. బిజెపి తెలుగుదేశం పార్టీకి దూరమైన నేపథ్యంలో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
టిడిపి, జనసేన, వామపక్షాలు మహా కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మతతత్వ పార్టీగా భావిస్తూ బిజెపిని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మహా కూటమిలోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఆచితూచి అడుగులు
తన జనసేన పార్టీని పవన్ కల్యాణ్ మూడేళ్ల క్రితం స్థాపించారు. అయితే, ఇప్పటి వరకు వ్యవస్థాగత నిర్మాణం జరగలేదు. ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల వారీ సేవాదళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన లక్ష్యాలను ఖరారు చేసి, స్పష్టత ఇవ్వడానికి ముందే వ్యూహాన్ని ఖరారు చేసుకునే దిశగా పవన్ కల్యాణ్ సాగుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video


సమస్యలపై పోరాటమే...
పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి కన్నా దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఆయన చంద్రబాబుతో కలిసి పని చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కార బాధ్యతను తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అందుకు చంద్రబాబు సహకారం కూడా తీసుకున్నారు. రానున్న రోజుల్లో చేనేత కార్మికుల సమస్యలతో పాటు అవయవదానం ప్రాజెక్టును కూడా చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరిన్ని సమస్యలను కూడా గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

పాదయాత్ర చేస్తారా...
సమస్యలను గుర్తించిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అక్టోబర్ నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర ఆలోచన కూడా ఆయనకు ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యల్లో కాపు సమస్య ఒకటి అని, కులంతో ముడిపెట్టి దాన్నే ప్రధాన సమ్సయయగా చూడకూడదని ఆయన భావిస్తున్నారు. ఆ రకంగా మిగిలిన కులాల వారిని దూరం చేసుకోకుండా ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు.

బిజెపికి, వైసిపికి సంకేతాలు.
రానున్న రోజుల్లో రాజకీయ పునరేకీకరణ విషయంలో పవన్కల్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు దగ్గర కావడం ద్వారా బిజెపికి, వైసిపికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. పార్టీ ఇప్పటికిప్పుడు అద్భుతాలు చేస్తుందని ఆయన చెప్పడం లేదు. అద్భుతాలు చేయాలని కూడా అనుకోవడం లేదు. అందువల్ల నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే సేవాదృక్పథం గల కార్యకర్తలను ఆయన ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విమర్శలు చేయడం కన్నా సమస్యలను పరిష్కరించే దిశలో పనిచేయాలని ఆయన అనుకుంటున్నారు.

కెసిఆర్ మాటను కూడా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపికి అనుకూలంగా 45శాతం మంది మొగ్గుచూపుతున్నారని, టిడిపి వైపు 43శాతం మంది మొగ్గు చూపుతున్నారని, బిజెపికి 2.6శాతం, జనసేనవైపు ఒక శాతం మంది మొగ్గు చూపుతున్నారని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కల్యాణ్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసే కన్నా ప్రజల మనసులను చూరగొనడానికి అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

జగన్తో బిజెపి....
టిడిపి, జనసేన, వామపక్షాలు మహాకూటమి కడితే అనివార్యంగా బిజెపి జగన్కు దగ్గరవుతుందని భావిస్తున్నారు. అక్టోబర్ 27 నుండి పాదయాత్ర చేయనున్నట్టు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ను ఎదుర్కోవడమే ఎజెండాగా పవన్ కల్యాణ్ వ్యూహరచన ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్థితిలో సెప్టెంబర్ 2వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications