ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డు దారుణ హత్య, లారీని ఢీకొన్న బస్సు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షామీర్ పెట్ మండలం హకీంపేట ప్రాంతంలో యాక్సెస్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హకీంపేటకు చెందిన బాలరాజు గౌడ్ (55) కుటుంబసభ్యులతో కలిసి బస్ డిపో కాలనీలో నివసిస్తున్నాడు.

ఇంటి సమీపంలోని యాక్సెస్ బ్యాంకు ఏటీఎమ్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విధులక హాజరైన బాలరాజ్ గౌడ్ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఘటనాస్ధలంలో ఎలాంటి దొంగతనం జరిగినట్లు ఆనవాలు లేవని పోలీసులు తెలిపారు. ఆల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫి ఘటనాస్ధలిని పరిశీలించి... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొన్న బస్సు
విజయవాడ నుంచి హైదరాబాదుకు వస్తున్న ప్రియాంక ట్రావెల్స్ బస్సు (ఏపీ 10 వీ 2255) నేటి తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. హయత్ నగర్ మండలం పరిధిలోని అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ టైర్ పంక్చర్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications