ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డు దారుణ హత్య, లారీని ఢీకొన్న బస్సు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షామీర్ పెట్ మండలం హకీంపేట ప్రాంతంలో యాక్సెస్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హకీంపేటకు చెందిన బాలరాజు గౌడ్ (55) కుటుంబసభ్యులతో కలిసి బస్ డిపో కాలనీలో నివసిస్తున్నాడు.

ఇంటి సమీపంలోని యాక్సెస్ బ్యాంకు ఏటీఎమ్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విధులక హాజరైన బాలరాజ్ గౌడ్ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఘటనాస్ధలంలో ఎలాంటి దొంగతనం జరిగినట్లు ఆనవాలు లేవని పోలీసులు తెలిపారు. ఆల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫి ఘటనాస్ధలిని పరిశీలించి... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొన్న బస్సు
విజయవాడ నుంచి హైదరాబాదుకు వస్తున్న ప్రియాంక ట్రావెల్స్ బస్సు (ఏపీ 10 వీ 2255) నేటి తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. హయత్ నగర్ మండలం పరిధిలోని అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ టైర్ పంక్చర్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications