డైరెక్టర్ బాబీ బూతు కామెంట్స్.. వీడియో వైరల్ !!
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న పేరు బాబీ కొల్లి. ఆయన అసలు పేరు కె.ఎస్.రవీంద్ర. గుంటూరులో పుట్టి పెరిగిన బాబీ.. బి.కాం పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్కు వచ్చాడు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పూర్తిగా తన ప్రతిభతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఘోస్ట్రైటర్ నుంచి స్టార్ డైరెక్టర్గా..
కాగా బాబీ సినీప్రస్థానం మొదట ఘోస్ట్రైటర్గా ప్రారంభమైంది. 2008లో విడుదలైన శ్రీహరి నటించిన భద్రాద్రి కథతో తనలోని టాలెంట్ నిరూపించుకున్నారు. ఆ తర్వాత వరుసగా డాన్ శీను, బాడీగార్డ్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలకు స్క్రీన్ప్లే అందించాడు. బలుపు, అల్లుడు శీను వంటి సినిమాలకు కథలు ఇచ్చి మెప్పించారు. చివరకు 2014లో రవితేజతో వచ్చిన పవర్ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆయన చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ, వెంకీ మామా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. రీసెంట్ గానే ఈ ఏడాది బాలయ్యతో "డాకు మహారాజ్" మూవీతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించారు.

వనభోజనాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇటీవల కార్తీకమాసం సందర్భంగా కాపు వర్గం నిర్వహించిన వనభోజనాలకు బాబీ హాజరయ్యాడు. అక్కడ చేసిన ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. సాధారణంగా సైలెంట్గా ఉండే బాబీ.. ఈసారి పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి భావావేశంతో మాట్లాడటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మీ అందరిని చూస్తుంటే జనసేన బలం, కళ్యాణ్ ఆవేశం.. చిరంజీవి ఓపిక కనిపిస్తోందన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని.. ఎలాంటి సపోర్ట్ లేకుండా హైదరాబాద్ వచ్చి ఈ స్థాయికి చేరానన్నారు. మన కమ్యూనిటీపై 'ఆవేశపరులు' అనే ట్యాగ్ ఉంది.. కానీ ఓపికతో సాధించగల శక్తి మనకుంది.
స్టార్డమ్ వదిలేసి, ఏసీ గదులు పక్కన పెట్టి ప్రజాసేవ కోసం ప్రయాణించే పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అలానే ఆవేశంగా మాట్లాడుతూ.. నీ** ఉన్నాంరా అంటూ వందల కోట్లు వదిలేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో బాబీపై విమర్శలు చేస్తున్నారు. మైక్ అందుకున్నందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఫ్యామిలీ & సినిమా..
బాబీ చెస్ గ్రాండ్మాస్టర్ హారిక ద్రోణవల్లి అక్క అనూషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె పుట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో #మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్డ్రాప్ తో చూపించారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ని బాబీ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
-
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
నా కథను మానభంగం చేసేశారు..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం రద్దు.. పవన్ సంచలన నిర్ణయం వెనుక! -
ఎన్డీఏలోకి టీవీకే విజయ్, పవన్ కల్యాణ్ కీలక మంత్రాంగం..!? -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..? -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
నాగ చైతన్య - రష్మిక కు అవార్డులు, దుమ్మురేపిన రాజు వెడ్స్ రాంబాయి












Click it and Unblock the Notifications