పూసలమ్మడం టూ పాన్ ఇండియా హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా !!!
లక్ అంటే వీరిదే అని కొన్ని ఘటనలు చూస్తే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ తరహా ఘటనలకు ఉదాహరణ అంటే "మోనాలిసా భోంస్లే" అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు.. పూసలు అమ్ముతూ కనిపించి అందరినీ ఆకర్షించింది. ఆమె సహజమైన అందం, చిరునవ్వుకు అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా.. మోనాలిసాతో "ది డైరీ ఆఫ్ మణిపూర్" అనే చిత్రం అనౌన్స్ చేశారు. దాంతో మోనాలిసా క్రేజ్ నార్త్లోనే కాకుండా సౌత్లోనూ బలంగా పెరిగిపోయింది. ఆ తర్వాత షాప్ ఓపెనింగ్లు చేస్తూ బిజీ బిజీగా మారిన ఈ అమ్మడు.. రీసెంట్ గానే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ తెలుగు ప్రేక్షకులను సైతం అలరించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో "లైఫ్" అనే సినిమా ప్రారంభోత్సవం అయ్యింది. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహించనుండగా.. చరణ్ సాయి హీరోగా నటిస్తున్నాడు. చరణ్ గతంలో క్రష్, ఇట్స్ ఓకే గురు సినిమాల్లో హీరోగా చేశారు.

కాగా ఇప్పుడు రీసెంట్ గానే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ సంస్థ 'బేల్ ట్రీ హోటల్' తన సేవలను మరింత విస్తరించింది. నూతన కిచెన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనిని మోనాలిసా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ తర్వాత కిచెన్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి. ఈ మేరకు హోటల్ యాజమాన్యం, సిబ్బంది మోనాలిసాకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మోనాలిసా మాట్లాడుతూ.. బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆహార ప్రియులకు ఇక్కడ అద్భుతమైన రుచులు అందుతాయని నమ్మకం ఉందన్నారు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం, ఆతిథ్యం చాలా బాగున్నాయి అని కొనియాడారు. స్వయంగా కొన్ని వంటకాలను పరిశీలించిన ఆమె స్వయంగా కిచెన్ లో కాఫీ కూడా తయారుచేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

బేల్ ట్రీ హోటల్స్ మరో యజమాని బాపిరెడ్డి మాట్లాడుతూ.. కస్టమర్ల ఆరోగ్యానికి, రుచికి పెద్దపీట వేస్తూ ఈ కొత్త కిచెన్ను డిజైన్ చేసినట్లు తెలిపారు. అత్యాధునిక పరికరాలతో వంటగదిని పూర్తిగా శానిటైజ్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ తో పాటు కాంటినెంటల్ వంటకాలను అందించడానికి ప్రత్యేక షెఫ్లను నియమించారు. కూరగాయలు, నాణ్యమైన దినుసులతో ఇంటి రుచిని తలపించేలా వంటలు సిద్ధం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
-
"టమాటా - ఎండు చేపల కూర" ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ కావాల్సిందే..! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
శనగపప్పు పాయసం ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే.. అసలే వదిలిపెట్టరు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications