హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ చెల్లెలు.. సపోర్ట్గా మెగా డైరెక్టర్..!
తెలుగు సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది ఉష శ్రీ. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో ఆడియన్స్ ను అలరించింది. ఇప్పటికే పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేసిన ఈ భామ.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. చరణ్ సాయి హీరోగా.. ఉషశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం "ఇట్స్ ఓకే గురు". సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటించిన ఈ మూవీని మణికంఠ దర్శకత్ వహించారు. వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. డిసెంబర్ 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ.. తాను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశానని గుర్తు చేసుకున్నారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ ని నమ్మి చేసిన సినిమా అది అని.. ఆ మూవీ తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదన్నారు.
అలానే ఈ సినిమా చూస్తుంటే తనకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుందని అన్నారు. డైరెక్టర్ మణికంఠ, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయని.. ఈ మూవీ కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

మెహర్ రమేష్ సినిమాలో ప్రభాస్ సిస్టర్ గా చేశానని.. చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఈరోజు మెయిన్ లీడ్ గా చేస్తున్న సినిమాకి గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి థాంక్యూ అని చెప్పారు. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని.. హీరోయిన్ గా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications