ఏపీ పీజీఈసెట్‌ రిజల్ట్స్ రిలీజ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2025 (AP PGECET) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌' (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. అలానే పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/PGECET/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థుల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సీట్ల కేటాయింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివరాలను APSCHE అధికారికంగా ప్రకటించనుంది. విద్యార్థులు అప్డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలిస్తు ఉండాలి.

ap-pgecet-results-released-by-minister-lokesh

ఇక ఈ పరీక్షకు మొత్తం 14,231 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 11,244 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత శాతం 93.55% గా నమోదైంది. అర్హత సాధించిన వారిలో 5,491 మంది విద్యార్థులు, 5,753 మంది విద్యార్థినులు ఉన్నారు.

మరోవైపు ఏపీ పీజీఈసెట్ 2025 పరీక్షలు జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లుగా జరిగాయి. ఉదయం సెషన్: 9:00 AM - 11:00 AM ఒకటి. మధ్యాహ్నం సెషన్: 2:00 PM - 4:00 PM వరకు జరిగాయి. ప్రిలిమినరీ కీ జూన్ 11న విడుదల చేయగా, అభ్యంతరాలను జూన్ 14 రాత్రి 11:59 గంటల వరకు స్వీకరించారు. అంతే కాకుండా ఈ సంవత్సరం పీజీఈసెట్‌ను ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన 13 సబ్జెక్టుల్లో నిర్వహించారు. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+