ALERT:రేపటి నుంచే ఐఐటీ జేఈఈ మెయిన్.. ఆ బట్టలు వేసుకుంటే నో ఎంట్రీ
విద్యార్థులకు అలర్ట్. ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 2, 3, 4, 7, 8 తేదీల్లో రోజుకు రెండు షిఫ్ట్లలో ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ లోకి ప్రవేశానికి పేపర్-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇక బీఆర్క్, బీ ప్లానింగ్ ప్రవేశాలకు పేపర్-2ను ఏప్రిల్ 9వ తేదీన ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తారు.
ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షకు తొలి విడత పేపర్-1 పరీక్షలకు మొత్తం 13.11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12.58 లక్షలు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా. తొలి విడతలో భాగంగా తెలిపిన ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే100 పర్సంటైల్ స్కోర్ ను సాధించారు.
తుది విడతపరీక్షలు ముగిసిన తర్వాత ఎన్టీఏ ఏప్రిల్ 17న లేదా అంతకు ముందే అఖిల భారత ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగా దేశంలో ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఒకవేళ ఐఐటీల్లో చేరాలనుకుంటే మాత్రం మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఈ రూల్స్ తెలుసా..?
పరీక్షా కేంద్రం గేట్లను ఉదయం 8.30, అలాగే మధ్యాహ్నం 2.30 గంటలకు మూసేస్తారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఇక మొదటి షిప్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో షిప్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. రెండు పాస్ ఫొటోలు, పెన్ను, అడ్మిట్ కార్డు తీసుకెళ్లాలి.
బీఆర్క్ పరీక్షకు పెన్సిల్, స్కేల్, రబ్బరు, జామెంట్రీ బాక్స్ కూడా తీసుకెళ్లాలి. మఫ్లర్లు, షాల్స్, టోపీలు, రంగుల కళ్లద్దాలు, స్కార్ప్లు, స్టోల్స్ వంటివి ధరిస్తే లోపలికి ఎంట్రీ లేదు. అభ్యర్థులు పాకెట్లు లేని దుస్తులను వేసుకొని వెళ్లాలి. వదులుగా ఉండే దుస్తులను వేసుకోవాలి. దుస్తులపై మెటాలిక్స్, అలంకారాలు ఉంటే సెంటర్లోకి అనుమతి లేదు. పరీక్ష కేంద్రంలోకి బూట్లు, బరువున్న చెప్పులు వేసుకోకూడదు. ఉంగరాలు, గాజులు, ఆభరణాలు, నగలు వేసుకోవద్దని రూల్స్ లో ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications