midhani recruitment 2022: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
హైదరాబాద్: నగరంలోని మిశ్రధాతు నిగం లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజర్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ. 5.20 లక్షల వరకు
సీనియర్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ. 11.60 లక్షల వరకు.
అర్హతలు:
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంబీఏ(మెటీరియల్స్ మేనేజ్మెంట్/ప్రొడక్షన్ మేనేజ్మెంట్/ఆపరేషన్ మేనేజ్మెంట్/ సప్లై చైన్ మేనేజ్మెంట్), పీజీ డిప్లొమా (మెటీరియల్ మేనేజ్మెంట్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15, 2022
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications