UPSC ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) అభ్యర్థులకు బిగ్ అలెర్ట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మే 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
యూపీఎస్సీ సివిల్స్-2025 కు సంబంధించిన ప్రిలిమినరీ ఫలితాలు చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. హాల్ టికెట్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి.. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అంతేకాక ఇండియన్ ఫారెస్టు సర్వీస్ లోని ఉద్యోగాల భర్తీ కోసం మే 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ బోర్డు విడుదల చేసింది. ఐఎఫ్ఎస్ కు క్వాలిఫై అయిన వారి లిస్టును కమిషన్.. అధికారిక సైట్ లో ఉంచింది.

యూపీఎస్సీ సివిల్స్-2025 కు సంబంధించిన ప్రిలిమినరీ ఫలితాలతో పాటు అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీలను ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక అప్ లోడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు రూ.200 రుసుం చెల్లించి వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. మహిళలు,దివ్యాంగులు,ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు జూన్ 16 నుంచి 25వరకు కమిషన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications