సుమన్ శెట్టిదే షాక్ అయితే.. మరో బిగ్ షాక్ రెడీ.. ఇవాళ ఎలిమినేషన్ అతనే ??
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ దశకు చేరుకుంది. వచ్చే ఆదివారంతో ఈ సీజన్కు అధికారికంగా ఎండ్ కార్డ్ పడి మరికొన్ని రోజుల్లో విజేత ఎవరో తేలనుంది. దాదాపు 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో చివరి వారంలోకి అడుగుపెట్టడంతో టాప్ 5 మాత్రమే మిగిలి ఉండాలి. దాంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు. అయితే ఈ వారం డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి, సంజన ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. అంతా సంజన ఎలిమినేట్ అవుతుందని భావించినా.. అనూహ్యంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు.
కాగా మిగిలిన వారిలో డీమాన్ పవన్, భరణి, సంజన, కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉంది తనూజ. సోషల్ మీడియా లెక్కలు చూస్తుంటే తనూజకు 26 శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆమె తర్వాతి స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. ఆ తర్వాత డీమాన్ పవన్, భరణి, సంజన తర్వాతి స్థానాల్లో ఉన్నారని సమాచారం.

అయితే అయితే గతవారం ఓటింగ్ తో సంబంధం లేకుండా రీతూను బయటకు పంపించారు. ఇక ఇప్పుడు కూడా అదే జరగనుందని అంతా అంటున్నారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం ఈరోజు భరణి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. నిజానికి భరణికి సంజన కంటే ఆయనకే ఎక్కువ ఓటింగ్ ఉన్నా కానీ ఇప్పుడు ఊహించని విధంగా బయటకు వచ్చినట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
మరోవైపు డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే ఫైనల్ ఎపిసోడ్ జరగనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. టాప్-5 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో లేటస్ట్ ప్రోమోలో బిగ్ బాస్ విజేతలకు అందించే ప్రైజ్ మనీని అధికారికంగా రివీల్ చేశారు హోస్ట్ నాగార్జున. కాగా బిగ్బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుతుందని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే రన్నరప్ తో పాటు ఇతర టాప్-5 కంటెస్టెంట్స్ కు ఎంతెంత అమౌంట్ వస్తుందో మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.












Click it and Unblock the Notifications