TG20 బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ.. యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు ఈ యంగ్ హీరో. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్.. పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తిరుగులేని సక్సెస్ అందుకొని గీతాగోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంచెం స్లో అయ్యారు. పూరి దర్శకత్వంలో చేసిన లైగర్ బిగ్ షాక్ ఇస్తే.. ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఇక ఈ ఏడాది కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబాలి చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు రీసెంట్ గానే నటి రష్మిక మందన్నాను వివాహం చేసుకొని అటు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ బిజీగా గడిపేస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న "టీజీ20 లీగ్" కి బ్రాండ్ అంబాసిడర్గా నియామకం కావడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రికెట్ టోర్నీని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్లో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా వ్యవహారిస్తున్న ఈ పోటీలో.. ప్రతి జట్టు మిగతా అన్ని టీమ్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్లో మొత్తం 38 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి. జూలై 12న ఉప్పల్ స్టేడియం వేదికగా ఫైనల్ ఫైట్ జరుగుతుంది. జీ20 (TG20) లీగ్ ట్రోఫీని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర ఆవిష్కరించనున్నారు.
విజేతకు రూ.కోటి.. రన్నరప్కు రూ.50 లక్షలు
- లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు జూలై 9న ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనున్నాయి.
- ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది.
- జులై 9న రాత్రి జరిగే క్వాలిఫయర్-1లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఢీకొంటాయి.
- జులై 12న టైటిల్ పోరు ఉండనుండగా విజేతగా నిలిచే జట్టుకు కోటి రూపాయలు, రన్నరప్కు 50 లక్షల ప్రైజ్ మనీ అందుతుంది.
- ఈ వేడుకకు హెచ్సీఏ ప్రతినిధులతో పాటు క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
మరోవైపు అటు ఏపీలో ఇప్పటికే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-5 ప్రారంభమైంది. ఈ నెల 9న ప్రారంభమైన ఏపీఎల్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. నేటినుంచి ఈ నెల 21 వరకూ కడపలో తొలిసారి ఏపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు జరగనుండగా వాటిని ఉచితంగా చూడవచ్చు.
🚨 ATTENTION TELANGANA 🚨
— tg20official (@tg20official) June 16, 2026
A new partnership is in order! 🤝😍
Telangana’s icon Vijay Deverakonda is now #SreenidhiUniversityTG20’s Official Brand Ambassador! ⚡️
We're thrilled to have the iconic superstar join us in our vision to take cricket in Telangana to newer heights! 🫡 pic.twitter.com/RuKiPplhFZ












Click it and Unblock the Notifications