కూతుళ్లపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా తనదైనశైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆమె కోల్కతాలో జునియర్ డాక్టర్పై అత్యాచార ఘటనపై రియాక్ట్ అయ్యారు. దీనిపై ఆమె తన ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ ఒకటి పెట్టారు.
''ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా కోసం నిలబడటానికి ప్రయత్నించలేదు. నా హక్కుల కోసం పోరాటం చేయలేదు. కానీ రేపటి నా కూతుళ్ల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు గళం విప్పుతున్నాను. మహిళలపై అత్యాచారాలు జరగడం సహించకూడదు.రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మన చట్టం. దేశంలో మీరు పోరాడలేకపోతే కనీసం ఈ సంఘటన గురించి మాట్లాడండి. సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడటం బెటర్. ఆ పని నేను చేస్తాను. మీరు చేయగలరా?'' అని ప్రశ్నించింది. ఆలేఖ్య రెడ్డి చేసిన పోస్ట్పై కొందరు ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

ఇక అలేఖ్య రెడ్డి వ్యక్తిగత జీవితానికి వస్తే.. తారకరత్న మరణంతో ఆమె ఒంటరైయ్యారు. అలేఖ్య, నందమూరి తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కులాలు వేరు కావడంతో అలేఖ్య రెడ్డి, తారకరత్నను నందమూరి కుటుంబం చేరదీయలేదు. దీంతో తారక్ తన భార్యతో వేరుగా ఉంటూ వచ్చాడు. చాలా సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు కూడా జన్మించాడు.
తన కుటుంబంతో తారకరత్న అప్పుడప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక అంతా బాగుందనుకునేలోపే తారకరత్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. తారకరత్న చనిపోయిన తర్వాత కూడా ఆయన తల్లిదండ్రుల్లో ఎటువంటి మార్పు రాలేదని తెలుస్తోంది. అలేఖ్య సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబం నుంచి తనకు ఎటువంటి ఆదరణ లేదని ఆమె చెప్పడం జరిగింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications