సంసారం ఒకరితో పెళ్లి మరొకరితో ..రామ్ చరణ్ హీరోయిన్ బాగోతం
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు, డేటింగ్, విడాకులు అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా బాలీవుడ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ నటీ, నటుల మధ్య అనేక రుమర్స్ వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య కూడా అధికంగానే కనిపిస్తుంది. అయితే అందరిలా తాను ఎందుకు ఉండాలని భావించిందో ఏమో తెలియదు కాని బాలీవుడ్ హీరోయిన్ విచిత్రంగా ఆలోచించింది.
సాధారణంగా ఎవరైనా పెళ్లి తరువాత ఎఫైర్ పెట్టుకుంటే పెళ్లి ఒకరితో .. సంసారం మరొకరితో అనే మాట మనం తరుచూ వింటుంటాం. కానీ ఈ హీరోయిన్ మాత్రం సంసారం ఒకరితో పెళ్లి మరొకరితో అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. అమీ జాక్సన్. బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్...బ్రిటిష్ - ఇండియన్ అనే సంగతి అందరికి తెలిసిందే.

అయితే అమీ జాక్సన్ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సుపరిచితమే. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పిక్ టైంలోనే ఇంగ్లాండ్కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. మూడేళ్లు అతనితో లివింగ్ రిలేషన్ కొనసాగించిన అమీ జాక్సన్...పెళ్లికి ముందే అతనితో ఓ బిడ్డను కూడా కనేసింది.
కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు రావడంతో ప్రియుడు జార్జ్కు గుడ్ బై చెప్పేసింది. కొంతకాలం సింగిల్గా ఉన్న అమీ జాక్సన్ ..తాజాగా మరో వ్యక్తితో రిలేషన్ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎడ్ వెస్ట్విక్ అనే బ్రిటిష్ నటుడితో ఈ అమ్మడు రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది.

తాజాగా తన కొత్త ప్రియుడుతో ఎంగేజ్మెంట్ తతంగాన్ని కూడా కానిచ్చేసింది. స్విడ్జర్లాండ్లోని మంచు పర్వతాల్లో ఓ వంతెన మీద ఎడ్ వెస్ట్విక్.. అమీ జాక్సన్ కి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇవ్వగా వెంటనే తొడిగించుకొని అక్కడే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications