పవన్ కల్యాణ్పై ఇంత పగ పట్టారా..'హరి హర వీర మల్లు' విడుదలకు బ్రేక్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చారిత్రాత్మక చిత్రం 'హరి హర వీర మల్లు' గ్రాండ్ ప్రీమియర్లకు కేవలం నాలుగు రోజుల దూరంలో ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం అభిమానులలో భారీ అంచనాలు నెలకొనగా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అని అందరి దృష్టి నెలఉంది.
అయితే, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఊహించని చిక్కుల్లో పడింది. ఈ చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నంకు వ్యతిరేకంగా రెండు ఫిర్యాదులు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి (TSFCC)లో దాఖలయ్యాయి.

మొదటగా, ఆసియన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ 'ఆక్సిజన్' చిత్రానికి చెల్లించిన రీఫండబుల్ అడ్వాన్స్తో పాటు వడ్డీతో సహా రూ. 2.60 కోట్ల బకాయిలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే, మహాలక్ష్మి ఫిల్మ్స్ కూడా 'ముద్దుల కొడుకు','బంగారం' చిత్రాలకు సంబంధించిన రూ. 90 లక్షలను వసూలు చేయాలని కోరుతూ ఎ.ఎం. రత్నంపై మరో ఫిర్యాదు దాఖలు చేసింది.
ఈ వివాదాలను పరిష్కరించడంలో సహకరించాలని, నిజాం ప్రాంతంలో 'హరి హర వీర మల్లు' విడుదలకు ముందే ఆసియన్ ఎంటర్ప్రైజెస్ మరియు మహాలక్ష్మి ఫిల్మ్స్ తమ బకాయిలను తిరిగి పొందడంలో సహాయం చేయాలని TSFCC ఈ చిత్ర పంపిణీదారులను అభ్యర్థించింది. సినిమా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఆర్థిక వివాదాలు 'హరి హర వీర మల్లు' చిత్ర యూనిట్కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ సమస్యలు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications