రష్మి బంగారం కొంటే.. బిల్లు కట్టిన రాజకీయ నాయకుడు
దాదాపు 10 సంవత్సరాల క్రితమే బుల్లితెరపై పదుల సంఖ్యలో లేడీ యాంకర్లు సందడి సందడి చేశారుకానీ ప్రస్తుతం వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ముగ్గురు నలుగురికి మించి ఎవరూ పేరు తెచ్చుకోలేకపోతున్నారు. ఉన్న నలుగురు యాంకర్లలో రష్మి ఒకరు. నటిగా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ ఈ చిన్నది మాత్రం యాంకర్ గా మారిన తర్వాతే అందరికీ తెలిసింది.. పేరు తెచ్చుకుంది. పదేళ్లుగా తన హవాను చూపిస్తూ బుల్లితెరపై దూసుకుపోతోంది.
ప్రస్తుతం రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆరు లక్షల రూపాయల విలువచేసే బంగారు నగలను ఓ రాజకీయ నాయకుడు బహుమతిగా ఇచ్చాడనేది ఆ వార్త సారాంశం. మొదటి నుంచి రష్మీకి సంబంధించిన ఏ వార్తనైనా ప్రజలు ఆసక్తిగా తిలకిస్తారు. దీంతో ఈ వార్త జెట్ స్పీడ్ కన్నా వేగంగా వైరలవుతోంది.

రష్మీ తాజాగా ఓ పాపులర్ జ్యుయలరీ షాపుకు వెళ్లిందట. ఆ షాపులో ఆమె ఆరు లక్షల రూపాయల విలువ చేసే బంగారం, ఇతర ఆభరణాలు కొనుగోలు చేసింది. కానీ వాటికి సంబంధించిన బిల్లును మాత్రం తాను చెల్లించలేదు. ఆ బిల్లును ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఆ షాపువారికి ఆన్ లైన్లో ట్రాన్స్ ఫర్ చేశారట. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఈ సంఘటనను నోరెళ్ల బెట్టి చూస్తుండిపోయారట.
ఆయన పేరున్న బడా రాజకీయ నాయకుడు కావడంతో ఈ వార్త హాట్ కేక్ లా ట్రెండ్ అవుతోంది. సదరు రాజకీయ నాయకుడికి రష్మీ ఎక్కడ పరిచయం అయింది? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆమె కోసం అంత ఖర్చుపెట్టిన నగలను ఎందుకు కొనిచ్చాడు? తదితర ప్రశ్నలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. వాస్తవానికి ఇదంతా ఎవరైనా కావాలని వార్తను పుట్టించారా? లేదంటే నిజంగానే జరిగిందా? రష్మీపై కోపంతో ఎవరన్నా ప్రచారం చేస్తున్నారా? అనేదానికి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రష్మీ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.












Click it and Unblock the Notifications