నేనొక అడల్ట్.. అందుకే అడల్ట్ సినిమాలే చేస్తా అంటోన్నబాలీవుడ్ నిర్మాత..
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ సోషల్మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. థ్యాంక్యూ ఫర్ కమింగ్ ప్రమోషన్స్లో భాగంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏక్తాకపూర్ను ఓ నెటిజన్ దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అంటూ విజ్ఞప్తి చేశాడు. నేనొక అడల్ట్, కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తా అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు ఏక్తాకపూర్.. ఏక్తాకపూర్ నిర్మించిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ మూవీ ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో భూమి భూమి ఫడ్నేకర్, బిగ్బాస్ నటి షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి కరణ్ బులానీ దర్శకత్వం వహించారు. ఏక్తాకపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
ప్రమోషన్స్లో భాగంగా : ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా ఈ అక్టోబర్ 6న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఏక్తాకపూర్ తాజాగా ట్విటర్ వేదికగా 'Ask Me Anything' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెటిజన్లు ఏక్తాకపూర్ను దూషించారు. అయితే, ఆమె అదే స్థాయిలో నెటిజన్లకు కౌంటర్ ఇచ్చారు.

నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ కామెంట్ చేశారు. అయితే నెటిజన్ల కామెంట్లకు తనదైన శైలిలో దిమ్మదిరిగిపోయే కౌంటర్లు ఇచ్చారు ఏక్తాకపూర్. నువ్వూ, ఆ కరణ్ జోహర్ కలిసి చాలామందిని చెడగొడుతున్నారు అని ప్రశ్నించారు. మరో నెటిజన్ ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణం అంటూ దూషించాడు. దీనికి ఓ అవునా అంటూ ఏక్తాకపూర్ కామెంట్ చేశారు.
ఎన్నో సినిమాలు.. మరెన్నో సీరియల్స్ : బాలాజీ టెలీఫిల్మ్స్ను స్థాపించి హిందీ సీరియల్స్కు క్రేజ్ను తెచ్చిపెట్టారు నిర్మాత ఏక్తాకపూర్. జితేంద్ర, శోభా కపూర్ కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె పలు సినిమాలు, సీరియల్స్ను నిర్మించడమే కాకుండా ఎంతో మంది నటులను బుల్లితెర సూపర్స్టార్గా తీర్చిదిద్దారు. రాగిణి ఎంఎంఎస్, డర్టీ పిక్చర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, డ్రీమ్గర్ల్ వంటి చిత్రాలకు ఏక్తాకపూర్ నిర్మాతగా వ్యవహరించారు. వీటితో పాటు ఎన్నో సీరియల్స్ను నిర్మించారు. ఆమె నిర్మించిన ఎన్నో సీరియల్స్ సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి.
కబీ బహు థీ సీరియల్తో బుల్లితెరపై సంచలనం సృష్టించింది. ఏక్తా కపూర్ తీసిన క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీరియలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సీరియల్ సీరియల్ స్మృతి జీవితాన్ని మార్చేసింది. ఈ సీరియల్స్ సమయంలోనే వీరిద్దరి మధ్య సేహ్నం కుదిరంది. ప్రస్తుతం స్మృతి ఇరానీ నటనకు దూరమయ్యి రాజకీయాలకు దగ్గరయ్యారు. ఏక్తా కపూర్ ఎన్నో సీరియల్స్ నిర్మించి, ఎంతో మందికి స్టార్ డం వచ్చేలా అవకాశాలు ఇచ్చారు. ఆమె నిర్మించిన సీరియల్స్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకున్నాయి.
-
సమంత "వావ్" వీడియో వైరల్..! -
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications