'జై హనుమాన్'లో మరో బిగ్ స్టార్.. రాముడి పాత్రలో పాన్ ఇండియా హీరో?
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'జై హనుమాన్' గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలోకి మరో బిగ్ స్టార్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'జై హనుమాన్' చిత్రంలో భల్లాలదేవ రానా దగ్గుబాటి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'హనుమాన్'కు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాలో రానా పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే మేకర్స్ రానాతో చర్చలు జరిపారని, ఆయన ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మార్చి లేదా ఏప్రిల్లో షూటింగ్ షురూ
తాజా రిపోర్ట్స్ ప్రకారం.. రానా దగ్గుబాటి ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ 2026 నుంచి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి హనుమంతుడి అవతారంలో కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రానా ఏ పాత్రలో కనిపిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంచారు. ఈ సినిమాలో రానా రాముడి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు రానా విలన్ పాత్రలో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రానా ఏ పాత్రలోనైనా ఇమిడి నటించగల స్టార్ కావడం విశేషం.

ఫిబ్రవరి 22న హంపీలో గ్రాండ్ లాంచ్
ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చారిత్రాత్మక నగరమైన హంపీ వేదికగా ఫిబ్రవరి 22, 2026న ఈ చిత్ర లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భారతీయ పురాణాలను సూపర్ హీరో కాన్సెప్ట్తో జోడించి తన సినిమాటిక్ యూనివర్స్ను విస్తరిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన హను-మాన్ చిత్రం దాదాపు రూ.295 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అనంతరం జై హనుమాన్ అనే ఈ సీక్వెల్లో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీని తర్వాత భగవంతుడైన ఇంద్రుడి కథతో ఒక సినిమా చేయనున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారు.
రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి వంటి ఇద్దరు పవర్హౌస్ పెర్ఫార్మర్స్ ఒకే స్క్రీన్పై కనిపించబోతుండటంతో 'జై హనుమాన్'పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మార్చిలో ప్రారంభం కానున్న ఈ షూటింగ్ షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్కు ‘శ్రీరామరక్ష’ -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
నా కథను మానభంగం చేసేశారు..! -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు"












Click it and Unblock the Notifications