అర్థరాత్రి అల్లు అర్జున్కు ఫోన్ చేసిన ఎన్టీఆర్... ఏం జరుగుతోంది?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకర్నొకరు బావా.. బావా.. అని పిలుచుకునేంత చనువు ఉంది. తాము చేస్తున్న సినిమాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ఫోన్ లో పంచుకుంటుంటారు. అంతేకాదు.. తమదగ్గరకు ఏదైనా కథ వస్తే ఇద్దరిలో ఎవరికి సెట్ అయితే వారు చేస్తారు. లేదంటే ఎన్టీఆర్ బన్నీ దగ్గరకు, బన్నీ ఎన్టీఆర్ దగ్గరకు ఆ కథలను పంపుతుంటారు. అంతేకాదు.. మరెన్నో విషయాలను వీరిద్దరూ మనసువిప్పి పంచుకుంటారు.
రెండో వ్యక్తి ఎన్టీఆర్
అలాగే అర్థరాత్రి సమయంలో సరిగ్గా 12.00 గంటలకు అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ ఫోన్ చేస్తారు. ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే అంత అర్థరాత్రి కాకుండా తెల్లవారి మాట్లాడతారు. అలా అర్థరాత్రి అదే సమయానికి ఫోన్ చేశారంటే అందుకు కారణం.. అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికే. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు సరిగ్గా మొదటగా శుభాకాంక్షలు చెప్పేది అతని భార్య స్నేహారెడ్డి. తర్వాత రెండో వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. వీరిద్దరూ అంత స్నేహంగా ఉంటారు. వీరిద్దరి సినిమాలు విడుదలైనప్పుడు అల్లు అర్జున్ అభిమానులు తారక్ సినిమాలను, తారక్ సినిమా విడుదలైనప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మద్దతు ఇచ్చుకుంటారు.

దేవరకు ఇలాగే.. పుష్ప2కు ఇలాగే
దేవరకు ఇలాగే జరిగింది.. పుష్ప2కు ఇలాగే జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో పుష్ప2ను విడుదల చేయబోతున్నారు. వీటిల్లో అధిక భాగం ఇండియాలోనే ఉన్నాయి. మనదేశంలో 6,500 థియేటర్లలో విడుదలవుతుండగా, విదేశాల్లో 5వేల థియేటర్లలో విడుదలవుతోంది. డిసెంబరు ఐదోతేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక గీతం చిత్రీకరించాల్సి ఉంది. హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్నారు. ఎక్కువగా శ్రద్ధాకపూర్ పేరు వినపడుతోంది. ఒకవేళ ఆమె కాదంటే తృప్తి దిమ్రిచేత ఐటం సాంగ్ చేయించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వార్2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ చిత్రం చేస్తారు.












Click it and Unblock the Notifications