జస్ట్ 5 కోట్లతో తీస్తే 50 కోట్లు.. ఓటీటీలోకి బుర్రపాడు మిస్టరీ థ్రిల్లర్..
మలయాళం నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతలా థ్రిల్ చేస్తాయో తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాల్ని తీయడమే వారి స్పెషాలిటీ. 5-10 కోట్లతో సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 50-100 కోట్లు వసూళ్లు సాధిస్తుంటాయి. ఇక మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. కేవలం రూ. 5 కోట్లతో ఈ సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు వసూళ్లు సాధించింది.
తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను అసలు మిస్ అవరూ. ఓటీటీలో వస్తే వెంటనే చూసేస్తారు. ఇక మలయాళం నుంచి వస్తే మిస్టరీ, థ్రిల్లర్, హారర్ మూవీస్ అయితే అసలు వదిలిపెట్టరు. ఇలాంటి సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతేడాది కిష్కింధ కాండం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు దిన్జిత్ అయ్యతన్.. ఈ ఏడాది మరో బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించారు. అదే 'ఎకో' మూవీ. కేవలం రూ. 5 కోట్లతో ఈ సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు వసూళ్లు సాధించిందీ మూవీ.
ఈ మూవీలో అలపుజా జింఖానా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే వినీత్, నరైన్ కీలక పాత్రల్లో మెరిశారు. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విమర్శకులనుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం కానుంది.

నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కేరళ, కర్ణాటక సరిహద్దులోని కాట్టుకున్ను అనే అటవీ ప్రాంతం నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది.
-
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
Varanasi ఊచకోత.. కేవలం ఓవర్సీస్లో రైట్స్కే అన్ని రూ.కోట్లా? -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications