మాటంటే లెక్కలేదా?.. ఆ హీరోయిన్ ఉంటే సినిమా చేయను: రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ప్రతిభను నిరూపించుకుంటూ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇవి కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది.
సినిమా చేసేటప్పుడు చెర్రీ కథను, దర్శకుడిని దృష్టిలో ఉంచుకుంటాడు. మిగతా విషయాలను పట్టించుకోడు. అయితే ఓ సినిమా విషయంలో మాత్రం ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో అంటూ ఆదేశాలు జారీచేశాడు. తనకు ఇష్టంలేని హీరోయిన్ ను తీసుకొచ్చి సినిమాలో పెట్టడంతో దర్శకుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు వద్దని చెప్పినా తీసుకొచ్చి పెట్టారు.. మాటంటే అంత లెక్కలేదా? అంటూ కోపంతో ఊగిపోయాడంట. ఆ హీరోయిన్ ఉంటే సినిమా చేసేది లేదంటూ సెట్ నుంచి వెళ్లిపోయారు.

దీంతో ఆ హీరోయిన్ ను తీసేసి ఆమె స్థానంలోకి అమలాపాల్ ను తీసుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే.. నాయక్. దీనికి దర్శకుడు వినాయక్. కాజల్, అమలాపాల్ కథానాయికలుగా నటించారు. రామ్ చరణ్ కెరీర్ లోనే మంచి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఆ హీరోయిన్ ఎవరు? ఆమెతో ఎన్నిరోజులు షూటింగ్ చేశారు? ఎందుకు రామ్ చరణ్ వద్దన్నాడు? వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం ఏమిటి? తదితర విషయాలు మాత్రం బయటకు రాలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలనే ఉద్దేశంతో శంకర్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నప్పటికీ భారతీయుడు సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో దానికే ఎక్కువ సమయం కేటాయించారు.












Click it and Unblock the Notifications