భారీగా పెరిగిన బాలయ్య పారితోషికం
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నారు. అలాగే ఫుల్ జోష్ మీద కూడా ఉన్నారు. తన తోటి అగ్ర కథానాయకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా ఎంతో ముందున్నారని చెప్పొచ్చు. అఖండ నుంచి వరుసగా హిట్లు కొడుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో వరుసగా సూపర్ హిట్లు ఇచ్చారు. బోయపాటి శ్రీనుతో చేసిన అఖండ2 డిసెంబరు 5వ తేదీన విడుదల కాబోతోంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామా చేయనున్నారు. ఈ సినిమాతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కొడతాడనే నమ్మకంతో నందమూరి అభిమానులున్నారు.
ఏనాడూ డిమాండ్ చేయలేదు
వాస్తవానికి బాలయ్య పారితోషికం విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేయరు. ఆయన నిర్మాతల గురించి, సినిమాకు అవుతున్న బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. నిర్మాతలు ఎంతిస్తే అంతే తీసుకుంటారు. ఈ విషయంలో ఆయనపై ఎప్పుడూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. అందుకే నిర్మాతలంతా బాలయ్యతో సినిమా తీయాలని కోరుకుంటుంటారు. అయితే అఖండ సినిమాతోపాటు తర్వాత చేసిన సినిమాలకు కూడా ఆయన తనకు ఇంత కావాలి అడగలేదు. కానీ నిర్మాతలే బాలయ్య పారితోషికాన్ని పైపైకి పెంచుకుంటూ వెళ్లారు. దీంతో ఆయన కాదనలేక తీసుకుంటున్నారు. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు రూ.45 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తేజస్వినికి అభినందనలు
బాలయ్య ఏ సినిమా చేయాలి? ఎటువంటి కథలను ఎంచుకోవాలి? ఆయన మేకప్, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలనే విషయాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని చూసుకుంటున్నారు. ఆమె దగ్గరుండి చూసుకుంటుండటంతో బాలయ్యకు వరుసగా బ్లాక్ బస్టర్లు పడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే అఖండ2తో నిర్మాతగా మారారు. ఆ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య రూ.45 కోట్లను పారితోషికంగా తీసుకుంటుండటంపై నందమూరి అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఇమేజ్ ను పెంచడంలో, పారితోషికాన్ని పెంచడంలో, క్రేజ్ ను పెంచడంలో తేజస్విని కీలక పాత్ర పోషిస్తోందంటూ అభినందనలు వస్తున్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications