పైరసీ సెగ: ఆన్లైన్లో 'రాజాసాబ్' HD ప్రింట్!
Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజాసాబ్ విడుదలైన వెంటనే బిగ్ షాక్ తగిలింది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూసేందుకు ఉత్సాహంగా ఉన్న సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన HD ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం కలకలాన్ని రేకెత్తించింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఓ హారర్-కామెడీ జోనర్ లో నటించడంతో 'రాజాసాబ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా థియేటర్లలో సందడి మొదలుపెట్టిన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్కు కోలుకోలేని దెబ్బ. టెలిగ్రామ్, పైరసీ వెబ్సైట్ల ద్వారా ఈ లింకులు వేగంగా వ్యాపించడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
ఆర్థిక చిక్కులు.. కోర్టు తీర్పు ప్రభావం
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టికెట్ ధరల వివాదం నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన ధరల పెంపు మెమోను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో, కలెక్షన్ల పరంగా కొంత లోటు కనిపిస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో పైరసీ కూడా తోడవడంతో, భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రంగంలోకి సైబర్ క్రైమ్, అభిమానులు
సినిమా లీక్ వార్త తెలియగానే ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించారు. "Say No to Piracy" అనే నినాదంతో పైరసీ లింకులను రిపోర్ట్ చేయడమే కాకుండా, సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అధికారులు కూడా ఈ లింకులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు, కానీ ఇంటర్నెట్ యుగంలో మూలాలను కనుగొనడం సవాలుగా మారింది.
సినీ ఇండస్ట్రీకి నిరంతర ముప్పు
కేవలం 'రాజాసాబ్' మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమాకు పైరసీ ఒక శాపంగా మారింది. నెలల తరబడి వేల మంది కష్టపడి చేసిన పని, ఒక్క రోజులో పైరసీ వల్ల బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఈ నష్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.సినిమా అనేది వేల కుటుంబాల జీవనాధారం. పైరసీని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరం.












Click it and Unblock the Notifications