రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు.ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైనరీతిలో సమాధానం ఇస్తున్నారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. జంతువులను హింసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తుంటారు. ఇక రేణు దేశాయ్ పలు ఎన్జీవోలను నడుపుతున్నారు. తద్వారా జంతువులతో పాటు, అనాథ ఆశ్రమాలకు సైతం ఆమె సాయం చేస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రేణు దేశాయ్ తల్లి మరణించారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తల్లి ఫోటో షేర్ చేసిన ఆమె ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు.అలాగే తన పోస్ట్లో ''పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జాతరే శయనం, ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా పరే పాహి మురారే." మళ్లీ మళ్లీ ఒకటి పుడుతుంది, మరల మరల ఒకరు మరణిస్తారు, మరల మరల ఒకరు తల్లి కడుపులో నిద్రపోతారు, ఈ అపరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చేయండి, ఇది దాటలేనిది, నా ప్రభూ'' అంటూ ఆదిశంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు. అయితే రేణు దేశాయ్ తల్లి ఎలా చనిపోయారు ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications