మీ ఇద్దరి కథ గురించి తెలుసుంటాను: శోభిత సంచలన వ్యాఖ్యలు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం గీత ఆర్ట్స్ బ్యానరులో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించిన తండేల్ చిత్రంలో నటించారు. చందు మెండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కథానాయికగా నటించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే మ్యూజికల్ హిట్స్ అయి సంచలనం సృష్టించాయి. ఈరోజు సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన తండేల్ నాగచైతన్యకు కెరీర్ లో మొదటి రూ.100 కోట్ల చిత్రం అవుతుందనే అంచనాలున్నాయి. జీఏ2 బ్యానరులపై నిర్మించిన తండేల్ బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కింది.
గడ్డం తీయి సామీ.. ముఖం దర్శనం చేసుకుంటాను
తాజాగా ఈ సినిమా గురించి అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాళ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, థియేటర్లలో ఈ సినిమా కచ్చితంగా చూస్తానని చెప్పింది. నాగచైతన్య-సాయిపల్లవి ప్రేమకథను వెండితెరపై చూసి ఆస్వాదిస్తానని ఆ పోస్ట్ లో పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నాగచైతన్య తండేల్ పైనే దృష్టి పెట్టారని, ఇప్పటివరకు తాను నాగచైతన్యను గడ్డంతో చూసి విసుగెత్తిందని, ఇకనైనా గడ్డం తీయి సామీ.. నీ ముఖం దర్శనం చేసుకుంటాను అంటూ రాసుకొచ్చింది. తేండల్ చిత్రంలోని అసాధారణమైన ప్రేమ కథను అందరూ చూసేవారు తాను ఎదురుచూడని, విడుదల రోజే చూసేస్తానని చెప్పింది.

సమంత చాలా దురదృష్టవంతురాలు
తండేల్ చిత్రంపై, నాగచైతన్యపై శోభిత చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. వివాహమై రెండు నెలలవుతోంది. కొత్త కోడలుగా అక్కినేని కుటంబంలో మంచిపేరు తెచ్చుకుంది. వివాహమైన తర్వాత ఇటీవలే తొలిసారిగా ఈ జంట బయట దర్శనమిచ్చింది. నాగచైతన్య-శోభిత చాలా సంతోషంగా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని లాంటి పెద్ద కుటుబంలోకి కోడలిగా అవకాశం వస్తే సమంత చాలా దురదృష్టవంతురాలై దాన్ని పోగొట్టుకుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేశమైనప్పటికీ శోభిత ధూళిపాళ చాలా అదృష్టవంతురాలంటున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అభిమానులు భారీ స్థాయిలో వస్తే తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన రాలేదంటున్నారు.












Click it and Unblock the Notifications