Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తారుమారైన సెలబ్రిటీల జీవితాలు

2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అలాగే 2024లో కొందరు సెలబ్రిటీలు వార్తల్లో నిలిచి సంచలనం సృష్టించారు.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు వినిపించాయి. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేయడం జరిగింది. హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్ మెట్టులెక్కింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్‌ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. అటు రాజ్ తరుణ్ సైతం ఆమెతో తాను శారీరక సంబంధం పెట్టుకున్న మాట వాస్తవమే అని తెలిపారు.

These are the celebrities involved in cases in 2024

ఇక ఇదే ఏడాది మాస్టర్ జానీ జీవితం కూడా తలక్రిందులైంది. కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
తన దగ్గర పని చేసే అస్టిస్టెంట్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు అందడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అస్టిస్టెంట్‌ డ్యాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జానీ మాస్టర్ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు.

ఇక ఈ ఏడాదే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా నమోదైంది. రాంగోపాల్ వర్మ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌, పవన్ కల్యాణ్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ కార్యకర్తలు ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి, ఆయన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

ఇక ఏడాది చివర్లో మంచు ఫ్యామిలీ సైతం పోలీస్ స్టేషన్ చూట్టు తిరుగుతోంది. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.దీంతో మంచు మనోజ్‌పైన ఆయన భార్య మౌనికపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+