ఇంత అందాన్ని తెలుగోళ్లు ఎలా మిస్ అయ్యారబ్బా..!
గత రెండు రోజులు ఓ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ ఫొటోలో ఓ అందమైన అమ్మాయి ఉండటమే దీనికి కారణం. దీంతో ఈ ఫొటో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఈ భామ పేరు గిరీష్ ఓక్. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ జనాలకు గిరీష్ ఓక్ సుపరిచితురాలే. ప్రముఖ మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కుమార్తె గిరిజా ఓక్, కేవలం నటననే కాకుండా, బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ప్రయాణం 15 ఏళ్ల చిన్న వయసులోనే వెండితెరపై అరంగేట్రంతో మొదలైంది.
గిరిజా ఓక్ మొదట్లో మరాఠీ సినిమా, టెలివిజన్ రంగంలో తన సత్తా చాటింది. 'గోష్ట చోటి డోంగ్రేవధి', 'గుల్మోహర్' వంటి చిత్రాలతో పాటు, జీ మరాఠీలో ప్రసారమైన 'లజ్జా' ధారావాహికతో బుల్లితెరపై ప్రధాన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే, ఇదే సమయంలో ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో హిందీ పరిశ్రమకు షిఫ్ట్ అయ్యారు.

బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ రూపొందించిన చిత్రం 'తారే జమీన్ పర్'లో నటించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ఆ తరువాత, 'షోర్ ఇన్ ది సిటీ' వంటి హిట్ చిత్రంలో నటనతో, కమర్షియల్ విమర్శకుల మెప్పు పొందే నటిగా పేరు తెచ్చుకున్నారు. హిందీ టీవీ సీరియల్ 'లేడీస్ స్పెషల్' రెండవ సీజన్లో ప్రధాన పాత్ర పోషించి, బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఇటీవలి కాలంలో, షారూఖ్ ఖాన్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం 'జవాన్'లో కూడా గిరిజా ఓక్ నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతం కావడంతో, ఆమె కెరీర్ మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా తెలుగు హీరో సందీప్ కిషన్ నటించిన'షోర్ ఇన్ ది సిటీ' మూవీలో గిరిజా ఓక్ రెచ్చిపోయి నటించింది. సందీప్ కిషన్తో ఏకంగా అదిరిపోయే లిప్ లాక్ ఇచ్చింది. తాజాగా గిరిజా ఓక్ ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె లుక్స్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఈ ఒక్క ఇంటర్వ్యూతో వచ్చింది. ప్రస్తుతం గిరిజా ఓక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications