రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది.. కట్ చేస్తే అతని వల్లే గర్భవతైన హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. అయితే ఓ హీరోయిన్ రాఖీ కట్టి అన్నయ్య పిలిచిన వ్యక్తితోనే ఏకంగా గర్భవతి అయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..అతిలోక సుందరి శ్రీదేవి. శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భూలోక సుందరిగా పేరు గాంచిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకున్నారామె.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి పాతతరం హీరోలతో పాటు, చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ వంటి రెండోతరం హీరోలతో కూడా ఆమె నటించారు. తమిళల్లో కూడా కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలతోనూ నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె వైవాహిక జీవితం కూడా శ్రీదేవిని వార్తల్లో నిలిచేలా చేసింది.
శ్రీదేవి బాలీవుడ్ దర్శకుడు బోనీ కపూర్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే బోనీ కపూర్కు పెళ్లి జరిగింది.బోనీ కపూర్ మోనా శౌరీను మొదటి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవితో ప్రేమలో పడి ఆమెను రెండో వివాహం చేసుకున్నారు బోనీ కపూర్.
అయితే శ్రీదేవి కారణంగా బోనీ కపూర్ మొదటి వివాహంలో కలతలు వస్తున్నాయని భావించిన అతని తల్లి నిర్మల కపూర్, ఒకరోజు శ్రీదేవిని ఇంటికి పిలిపించి బోనీ కపూర్కు రాఖీ కట్టించదట. ఈ విషయాన్ని బోనీ కపూరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బోనీ కపూర్, శ్రీదేవి రిలేషన్లో ఉండగానే ఆమె గర్భవతి కావడం, ఆ తర్వాత శ్రీదేవిని బోనీ కపూర్ పెళ్లి చేసుకోవడం జరిగింది. శ్రీదేవి ,బోనీ కపూర్ దంపతులకు పుట్టిన పిల్లలే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్.












Click it and Unblock the Notifications