సామాన్యుల ఇంటర్నెట్

ఈ విధంగా సామాన్యుల రచనలు, వారిపై రాసిన రచనలతో నెలనెలా ఈ మాసపత్రిక సామాన్యుల జీవితాలకు అక్షర నీరాజనం పలుకుతుంది. ఈ ప్రయత్నంలో ఆయా వ్యక్తులపై ముందు వ్యాసాలు రాస్తామని, అనంతరం పుస్తకాలు ప్రచురిస్తామని ఆయన చెప్పారు. ఈ పత్రిక నిర్వహణ కోసం సామాన్యశాస్త్రం ఇప్పటికే 119 మందిని కూడగట్టినట్లు రమేష్ చెప్పారు. వీరందరూ ఒక ఏడాది పాటు నెలనెలా ఇచ్చే వంద రూపాయలను ఫెలోషిప్ గా స్వీకరిస్తామని అన్నారు. వీరంతా ఆర్థిక సౌజన్యంతోనే సరిపెట్టుకోవడం లేదని, స్వయానా పౌర పాత్రికేయులుగా వ్యవహరిస్తూ తమకు తెలిసిన విశిష్టమైన వ్యక్తుల ఆచూకీ చెబుతున్నారని అంటూ ఈ సమిష్టి ప్రయత్నంలో జత కలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
"ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఓ లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయం తప్పక ఉండాలి" అనే ఆదర్శంతో, సమిష్టి పుస్తక ప్రచురణ లక్ష్యంగా సామాన్యశాస్త్రం రెండేళ్లుగా పేరులేని పెద్ద మనుషులపై పది పుస్తకాలు వెలువరించింది. లాభాపేక్ష లేకుండా ఈ పుస్తకాలను పది రూపాయలకే పాఠకులకు అందించింది. ఈ ఉత్తేజంతోనే సామాన్య శాస్త్రం మూడు నెలల క్రితం www.samanyashastram.com పేరుతో ఇంటర్నెట్ మాసపత్రికను ప్రారంభించింది.












Click it and Unblock the Notifications
