కిషన్జీకి గణపతి, ఇతర నేతలతో విభేదాలు?

కిషన్జీ మరణంతో మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరో బాధ్యతలను కిషన్దా చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కిందికి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, అస్సాం రాష్ట్రాలతో పాటు యుపి, ఒరిస్సా, చత్తీస్ఘడ్ల్లోని కొన్ని జిల్లాలు వస్తాయి. కిషన్జీ మరణంతో లాల్గడ్ ప్రయోగంపై మావోయిస్టులు పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కిషన్జీ పట్ల ఆ త్రయం అసంతృప్తికి పలు కారణాలున్నాయని అంటున్నారు. వాటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీకి మద్దతివ్వడం ప్రధామైంది. ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో ఆ ముగ్గురు అగ్రనేతలు కిషన్జీపై తీవ్ర విమర్శలు పెట్టినట్లు తెలుస్తోంది. మీడియాతో కిషన్జీ ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని కూడా తప్పు పట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
విప్లవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ క్యాడర్ను పెంచుకునే దిశగా కాకుండా కిషన్జీ నాయకత్వం రాజకీయ ప్రతీకారానికి ప్రాధాన్యం ఇచ్చిందని అంటున్నారు. సిపిఎంను గద్దె దించడానికి తృణమూల్ కాంగ్రెసుకు మద్దతివ్వడం పెద్ద తప్పిదంగా భావించినట్లు సమాచారం. ఆ చర్యలే ఇప్పుడు కిషన్జీ ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టిందనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రజా సంఘాలకు చెందినవారు పోలీసు ఇన్ఫార్మర్లుగా మారి, మావోయిస్టులకు వ్యతిరేక గుంపులు తయారైనట్లు చెబుతున్నారు. మొత్తంగా లాల్గఢ్ ప్రయోగం విఫలమైనట్లు చెబుతున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications