కిషన్జీకి గణపతి, ఇతర నేతలతో విభేదాలు?

కిషన్జీ మరణంతో మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరో బాధ్యతలను కిషన్దా చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కిందికి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, అస్సాం రాష్ట్రాలతో పాటు యుపి, ఒరిస్సా, చత్తీస్ఘడ్ల్లోని కొన్ని జిల్లాలు వస్తాయి. కిషన్జీ మరణంతో లాల్గడ్ ప్రయోగంపై మావోయిస్టులు పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కిషన్జీ పట్ల ఆ త్రయం అసంతృప్తికి పలు కారణాలున్నాయని అంటున్నారు. వాటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీకి మద్దతివ్వడం ప్రధామైంది. ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో ఆ ముగ్గురు అగ్రనేతలు కిషన్జీపై తీవ్ర విమర్శలు పెట్టినట్లు తెలుస్తోంది. మీడియాతో కిషన్జీ ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని కూడా తప్పు పట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
విప్లవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ క్యాడర్ను పెంచుకునే దిశగా కాకుండా కిషన్జీ నాయకత్వం రాజకీయ ప్రతీకారానికి ప్రాధాన్యం ఇచ్చిందని అంటున్నారు. సిపిఎంను గద్దె దించడానికి తృణమూల్ కాంగ్రెసుకు మద్దతివ్వడం పెద్ద తప్పిదంగా భావించినట్లు సమాచారం. ఆ చర్యలే ఇప్పుడు కిషన్జీ ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టిందనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రజా సంఘాలకు చెందినవారు పోలీసు ఇన్ఫార్మర్లుగా మారి, మావోయిస్టులకు వ్యతిరేక గుంపులు తయారైనట్లు చెబుతున్నారు. మొత్తంగా లాల్గఢ్ ప్రయోగం విఫలమైనట్లు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications