కిషన్జీకి గణపతి, ఇతర నేతలతో విభేదాలు?

కిషన్జీ మరణంతో మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరో బాధ్యతలను కిషన్దా చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కిందికి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, అస్సాం రాష్ట్రాలతో పాటు యుపి, ఒరిస్సా, చత్తీస్ఘడ్ల్లోని కొన్ని జిల్లాలు వస్తాయి. కిషన్జీ మరణంతో లాల్గడ్ ప్రయోగంపై మావోయిస్టులు పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కిషన్జీ పట్ల ఆ త్రయం అసంతృప్తికి పలు కారణాలున్నాయని అంటున్నారు. వాటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీకి మద్దతివ్వడం ప్రధామైంది. ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో ఆ ముగ్గురు అగ్రనేతలు కిషన్జీపై తీవ్ర విమర్శలు పెట్టినట్లు తెలుస్తోంది. మీడియాతో కిషన్జీ ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని కూడా తప్పు పట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
విప్లవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ క్యాడర్ను పెంచుకునే దిశగా కాకుండా కిషన్జీ నాయకత్వం రాజకీయ ప్రతీకారానికి ప్రాధాన్యం ఇచ్చిందని అంటున్నారు. సిపిఎంను గద్దె దించడానికి తృణమూల్ కాంగ్రెసుకు మద్దతివ్వడం పెద్ద తప్పిదంగా భావించినట్లు సమాచారం. ఆ చర్యలే ఇప్పుడు కిషన్జీ ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టిందనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రజా సంఘాలకు చెందినవారు పోలీసు ఇన్ఫార్మర్లుగా మారి, మావోయిస్టులకు వ్యతిరేక గుంపులు తయారైనట్లు చెబుతున్నారు. మొత్తంగా లాల్గఢ్ ప్రయోగం విఫలమైనట్లు చెబుతున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications