వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీ బౌల్డ్: రోహిత్ జోరు, ట్రోఫీతో సచిన్, నీతా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ఎనిమిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్‌ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిన ముబై ఇండియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరంభంలో వరుస పరాజయాలతో అల్లాడిన ఈ జట్టు ఆతర్వాత ఎదురుదాడికి దిగి, ప్లే ఆఫ్ దశకు చేరుకోవడమేగాక, మొదటి క్వాలిఫయర్‌లో చెన్నైని ఓడించి ఫైనల్ చేరింది.

టైటిల్ పోరులో మరోసారి చెన్నైపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసిన ముంబై.. ఆ తర్వాత చెన్నైని 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులకే పరిమితం చేసి, 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2013లో మొదటిసారి ఐపిఎల్ టైటల్‌ను సాధించిన ముంబై రెండోసారి విజేతగా నిలిచింది.

కాగా, ఫైనల్‌లో ఓడిపోవడం చెన్నైకి ఇది నాలుగోసారి. 2008, 2012, 2013 సంవత్సరాల్లోనూ చెన్నై ఇదే తరహాలో టైటిల్ పోరులో చేతులెత్తేసింది. 2010, 2011 సంవత్సరాల్లో టైటిల్‌ను కైవసం చేసుకున్న చెన్నై ఈ సారి హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగి, నిలకడగా రాణించినప్పటికీ, ఫైనల్‌లో తడబడింది.

ట్రోఫీతో పాంటింగ్, నీతా, సచిన్

ట్రోఫీతో పాంటింగ్, నీతా, సచిన్

ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీతో పాంటింగ్, నీతా అంబానీ, ఆమె కుమారులు, సచిన్ టెండూల్కర్, హర్భజన్.

ముంబై జోష్

ముంబై జోష్

ఐపిఎల్-8 సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుల ఆనందం.

వికెట్ తీసిన ఆనందం

వికెట్ తీసిన ఆనందం

చెన్నై బ్యాట్స్‌మన్ వికెట్ తీసిన ఆనందంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్, భజ్జీ.

స్మిత్

స్మిత్

చెన్నై బ్యాట్స్‌మన్ స్మిత్ షాట్ కొడుతున్న దృశ్యం. 48 బంతుల్లో 57 పరుగురులు చేశాడు.

ట్రోఫీ మాదే

ట్రోఫీ మాదే

ఐపిఎల్-8 ఫైనల్లో గెలిచిన అనంతరం ముంబై ఇండియన్ ఆటగాళ్ల ఆనందం.

ట్రోఫీ మాదే

ట్రోఫీ మాదే

ఐపిఎల్-8 ఫైనల్లో గెలిచిన అనంతరం ముంబై ఇండియన్ ఆటగాళ్ల ఆనందం.

మేమే గెలిచాం

మేమే గెలిచాం

ఐపిఎల్-8 ఫైనల్లో గెలిచిన అనంతరం ముంబై ఇండియన్ ఆటగాళ్ల ఆనందం.

నీతా అంబానీ ఆనందం

నీతా అంబానీ ఆనందం

ఐపిఎల్-8 ఫైనల్లో ముంబై ఇండియన్స్ గెలిచిన అనంతరం చిరునవ్వులు చిందిస్తున్న నీతా అంబానీ.

కుమారులతో నీతా అంబానీ

కుమారులతో నీతా అంబానీ

ఐపిఎల్-8 ఫైనల్లో ముంబై ఇండియన్స్ గెలిచిన అనంతరం కుమారులతో నీతా అంబానీ.

ధోనీ క్లీన్ బౌల్డ్

ధోనీ క్లీన్ బౌల్డ్

ఐపిఎల్-8 ఫైనల్లో 18 పరుగులు చేసిన అనంతరం లసిత్ మలింగ బైలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన చెన్నై కెప్టెన్ ధోనీ.

ధాటిగా ఆడిన సిమన్స్

ధాటిగా ఆడిన సిమన్స్

ముంబై ఆటగాడు లెండి సిమన్స్ మెరుపు ఇన్నింగ్స్ చేశాడు. 45 బంతుల్లో 68 పరుగులు సాధించాడు.

ట్రోఫీతో చెన్నై-ముంబై ఆటగాళ్లు

ట్రోఫీతో చెన్నై-ముంబై ఆటగాళ్లు

ఐపిఎల్-8 ఫైనల్ ఆరంభానికి ముందు ట్రోఫీతో చెన్నై-ముంబై ఆటగాళ్లు.

English summary
Mumbai Indians' (MI) love affair with Eden Gardens continued as they clinched their second IPL title following a crushing 41-run win over Chennai Super Kings in a lop-sided summit clash, here tonight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X