ఉత్సాహంగా సాగిన హాఫ్ మారథాన్(పిక్చర్స్)
విశాఖపట్నం: గో గ్రీన్ అంటూ సాగిన వైజాగ్ నేవీ మారథాన్ పరుగులో అటు నావికా దళ సిబ్బందితో పాటు సామాన్య పౌరులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పచ్చని టీ షర్ట్లు వేసుకుని పరుగు తీశారు. ఆదివారం ఉదయం 6గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చినరాజప్ప జెండా ఊపడంతో 5కిలో మీటర్లు పరుగు ప్రారంభమైంది.
పేర్లు నమోదు చేసుకున్న 2,444 మంది ఉల్లాసంగా పరుగు ప్రారంభించారు. ఆరేళ్ల చిన్నారి నుంచి ఎనభై ఏళ్ల వయసు వారు కూడా పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, అడ్మిరల్ రాణా తండ్రి 82ఏళ్ల వయస్సులోనూ పరుగులో పాల్గొనేందుకు వచ్చారు. కళాశాల స్థాయి నుంచే పరుగు మొదలుపెట్టానని, ఇప్పటి ఫిట్ గానే ఉన్నాని ఆర్మీలో సేవలంగించిన ఆయన తెలిపారు.
తొలుత 5.15గంటలకే ఈఎన్సి స్టాఫ్ చీఫ్ బిమల్ వర్మ జెండా ఊపడంతో 984 మంది హాఫ్ మారథాన్ పరుగును ప్రారంభించారు. ఇక 5.45గంటలకు ఈఎన్సి చీఫ్ సతీష్ సోనీ 10కిలోమీటర్ల పరుగు ప్రారంభించారు.
ఐఎన్ఎస్ కురునురా వద్ద ప్రారంభమైన ఈ పరుగుల్లో 5కిలోమీటర్ల పరుగు వుడా వద్ద యూ టర్న్ తీసుకోగా 10కిలోమీటర్ల పరుగు తెన్నేటి పార్క్ వద్ద, హాఫ్ మారథాన్ ఎండాడ బీచ్ పార్క్ వద్ద యూటర్న్ తీసుకుని కోస్టల్ బాటరీకి చేరుకోవడంతో ముగిసింది.

నేవీ హాఫ్ మారథాన్
గో గ్రీన్ అంటూ సాగిన వైజాగ్ నేవీ మారథాన్ పరుగులో అటు నావికా దళ సిబ్బందితో పాటు సామాన్య పౌరులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నేవీ హాఫ్ మారథాన్
పచ్చని టీ షర్ట్లు వేసుకుని పరుగు తీశారు. ఆదివారం ఉదయం 6గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చినరాజప్ప జెండా ఊపడంతో 5కిలో మీటర్లు పరుగు ప్రారంభమైంది.

నేవీ హాఫ్ మారథాన్
పేర్లు నమోదు చేసుకున్న 2,444 మంది ఉల్లాసంగా పరుగు ప్రారంభించారు. ఆరేళ్ల చిన్నారి నుంచి ఎనభై ఏళ్ల వయసు వారు కూడా పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నేవీ హాఫ్ మారథాన్
కాగా, అడ్మిరల్ రాణా తండ్రి 82ఏళ్ల వయస్సులోనూ పరుగులో పాల్గొనేందుకు వచ్చారు. కళాశాల స్థాయి నుంచే పరుగు మొదలుపెట్టానని, ఇప్పటి ఫిట్ గానే ఉన్నాని ఆర్మీలో సేవలంగించిన ఆయన తెలిపారు.

నేవీ హాఫ్ మారథాన్
తొలుత 5.15గంటలకే ఈఎన్సి స్టాఫ్ చీఫ్ బిమల్ వర్మ జెండా ఊపడంతో 984 మంది హాఫ్ మారథాన్ పరుగును ప్రారంభించారు.

నేవీ హాఫ్ మారథాన్
ఇక 5.45గంటలకు ఈఎన్సి చీఫ్ సతీష్ సోనీ 10కిలోమీటర్ల పరుగు ప్రారంభించారు.

నేవీ హాఫ్ మారథాన్
ఐఎన్ఎస్ కురునురా వద్ద ప్రారంభమైన ఈ పరుగుల్లో 5కిలోమీటర్ల పరుగు వుడా వద్ద యూ టర్న్ తీసుకోగా 10కిలోమీటర్ల పరుగు తెన్నేటి పార్క్ వద్ద, హాఫ్ మారథాన్ ఎండాడ బీచ్ పార్క్ వద్ద యూటర్న్ తీసుకుని కోస్టల్ బాటరీకి చేరుకోవడంతో ముగిసింది.

నేవీ హాఫ్ మారథాన్
21.1కిలో మీటర్ల పరుగును గంటా 12నిమిషాల 22సెకండ్లలో పూర్తి చేసి కెన్యాకు చెందిన టిటస్ గిట్బు విజేతగా నిలిచారు.

నేవీ హాఫ్ మారథాన్
డేనియల్ లాంగ్, రుత్ బాగో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

నేవీ హాఫ్ మారథాన్
10 కిలోమీటర్ల పరుగును 33నిమిషాల 43సెకన్లలో పూర్తి చేసిన బి శ్రీను విజేతగా నిలిచాడు. ఎం. యాదవ్, సుఖలాల్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

నేవీ హాఫ్ మారథాన్
వయస్సు ఆధారంగా మరో 20 ప్రత్యేక బహుమతుల్ని అందించగా 82ఏళ్ల సుఖలాల్కు ప్రత్యేక బహుమతిని అందించారు. పరుగులో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.

నేవీ హాఫ్ మారథాన్
గో గ్రీన్ అంటూ సాగిన వైజాగ్ నేవీ మారథాన్ పరుగులో అటు నావికా దళ సిబ్బందితో పాటు సామాన్య పౌరులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నేవీ హాఫ్ మారథాన్
పచ్చని టీ షర్ట్లు వేసుకుని పరుగు తీశారు. ఆదివారం ఉదయం 6గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చినరాజప్ప జెండా ఊపడంతో 5కిలో మీటర్లు పరుగు ప్రారంభమైంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications