నీరు బంగారమే: రికార్డు ర్యాలీలో బొంతు, రాజేంద్రప్రసాద్(పిక్చర్స్)
హైదరాబాద్: నీటి పొదుపునకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, నీటిని బంగారంలా చూసుకోవాల్సిన తరుణం వచ్చిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బంజారాహిల్స్లోని కేబీఆర్ జాతీయవనం ఎదుట జీహెచ్ఎంసీ, వాక్ ఫర్ వాటర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగర దాహార్తి తీర్చేందుకు 150 కి.మీల దూరం నుంచి జలాలను తెచ్చుకుంటున్నామని తెలిపారు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిని భూగర్భంలో ఇంకేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో మూవీ ఆర్టిస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సినీనటుడు తనికెళ్ల భరణి, శివాజీరాజా, శ్రీరామ్, అనిత, నిరంజన్రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ఉప్పల్, వాక్ ఫర్ వాటర్ సొసైటీ ప్రతినిధులు కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. కాగా, భారీ మనవహారాన్ని ఏర్పాటు చేసినందుకు 'ఇండియన్ బుక్ఆఫ్ రికార్డ్సు' సంస్థ ప్రతినిధులు నగర మేయర్ రామ్మోహన్కు రికార్డు నమోదు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.

నీరు బంగారమే
నీటి పొదుపునకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, నీటిని బంగారంలా చూసుకోవాల్సిన తరుణం వచ్చిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.

నీరు బంగారమే
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బంజారాహిల్స్లోని కేబీఆర్ జాతీయవనం ఎదుట జీహెచ్ఎంసీ, వాక్ ఫర్ వాటర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.

నీరు బంగారమే
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగర దాహార్తి తీర్చేందుకు 150 కి.మీల దూరం నుంచి జలాలను తెచ్చుకుంటున్నామని తెలిపారు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

నీరు బంగారమే
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిని భూగర్భంలో ఇంకేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నీరు బంగారమే
‘మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో మూవీ ఆర్టిస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

నీరు బంగారమే
ఈ కార్యక్రమంలో సినీనటుడు తనికెళ్ల భరణి, శివాజీరాజా, శ్రీరామ్, అనిత, నిరంజన్రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ఉప్పల్, వాక్ ఫర్ వాటర్ సొసైటీ ప్రతినిధులు కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.

నీరు బంగారమే
కాగా, భారీ మనవహారాన్ని ఏర్పాటు చేసినందుకు ‘ఇండియన్ బుక్ఆఫ్ రికార్డ్సు' సంస్థ ప్రతినిధులు నగర మేయర్ రామ్మోహన్కు రికార్డు నమోదు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications