Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్ వల్లనే విభజన?

YS Jagan
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బ్లాక్ మెయిల్ రాజకీయాల వల్లనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనకు ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ ఆధిపత్య రాజకీయాలు తమనే శాసించే స్థితికి రావడంతో అధిష్టానం వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు చెప్పవచ్చు. రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాలు ఎదిగి, తమనే సవాల్ చేసే ఏ చర్యను కూడా కాంగ్రెసు అధినాయకత్వం సహించదనే విషయాన్ని ఈ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలపైనే కాకుండా రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వంపై కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆధిపత్యం సంపాదించుకున్నారు. అయితే ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెసు అధినేత సోనియా గాంధీ పట్ల, పార్టీ అధిష్టానం పట్ట విధేయతను ప్రదర్శించుకుంటూ వచ్చారు. సోనియా పట్ల తాను విధేయంగా ఉన్నట్లు సమయం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదగడాన్ని పార్టీ అధిష్టానం గమనిస్తూనే వస్తున్నా దానికి చెక్ పెట్టడానికి పెద్ద ప్రయత్నించలేదు. చెక్ పెట్టడానికి తగిన సందర్భం కూడా రాలేదు.

వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో తన అనుచరులకే టికెట్లు వచ్చేలా చూసుకుని, వారిని గెలిపించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీనియర్లను కూడా పక్కన పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రతిదానికీ అధిష్టానం ఆమోదం ఉన్నట్లు ఆయన చెబుకుంటూ వచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో పరిస్థితులు మారిపోయాయి. వైయస్ అనుయాయులు జగన్ నాయకత్వం కోసం పట్టబడుతూ కాంగ్రెసు అధిష్టానాన్నే ధిక్కరించే పరిస్థితి వచ్చింది. వైయస్ జగన్ అధిష్టానం విధేయత అనుమానంగా మారింది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ప్రాంతాలతో సంబంధం లేకుండా మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు పట్టుబడుతూ వచ్చారు. రోశయ్యను ముఖ్యమంత్రిని చేయడాన్ని ప్రశ్నించారు. ఈ రకంగా జగన్ సోనియాకే సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించి, జగన్ ను పక్కన పెట్టడానికి చాలా కృషే చేయాల్సి వచ్చింది.

జగన్ సమస్యను పక్కదారి పట్టించి, తాము చేయదలుచుకున్న పనిని చేయడానికి మంచి సందర్భాన్ని కాంగ్రెసు అధిష్టానం ఎంచుకుంది. ప్రాంతాలతో ప్రమేయం లేకుండా జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తూ వచ్చిన మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పుడు ప్రాంతాలవారీగా విడిపోయారు. ఇక జగన్ నాయకత్వం ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి లేదు. తాము ఇచ్చిన మాటను నిలబెట్టకుంటామని చాటడానికి తగిన సందర్భాన్ని సోనియా ఎంచుకున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వం తనకు సవాల్ చేసే విధంగా పరిణమించకూడదనే ఉద్దేశంతో తీవ్రమైన చర్యకు దిగినట్లు భావించవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుతో సోనియా శుక్రవారం దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. సోనియాకు కెసిఆర్ విధేయంగా ఉండడానికి సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విజయోత్సవ ర్యాలీలో కెసిఆర్ చిత్రాలతో పాటు సోనియా చిత్రాలను కూడా ఊరేగించారని భావించవచ్చు.

రాష్ట్రంలో సంక్షోభాన్ని కేంద్ర నాయకత్వం ఆహ్వానించిందనే చెప్పవచ్చు. రాజీనామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజనకు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. రాష్టంలో రోశయ్య నేతృత్వంలోనో, మరొకరి నేతృత్వంలోనో ప్రభుత్వం ఉండడం కన్నా రాష్ట్రపతి పాలన ఉంటేనే తమ పని సులువు అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. శాసనసభ్యుల, మంత్రుల రాజీనామాలను కాంగ్రెసు అధిష్టానం అహ్వానిస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఇదంతా ఊహించే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పెద్ద రాష్ట్రం కావడం వల్లనే, ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఉండడం వల్లనే జగన్ తమను బెదిరించేందుకు సిద్ధపడ్డారని సోనియా భావించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలుగా విభజిస్తే జగన్ వంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మరొకరు పాల్పకుండా ఉంటారనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత త్వరగా తెలంగాణ ఏర్పాటుకు ముందుకు దిగడానికి కారణమని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+