చంద్రబాబు 'పిల్లివాటం'

తెలంగాణ ప్రజలు చంద్రబాబు సీమాంధ్రకు అనుకూలంగా ఉన్నారని భావిస్తే, సమైక్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అనుకూలంగా ముందుకు రావడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇది గోడ మీది పిల్లివాటంగానే పరిగణిస్తారు. ఇది రెండు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి నష్టమే కలగజేయవచ్చు. నిజానికి, చంద్రబాబు ఆలోచన మరో రకంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ పార్టీ బలంగా ఉండాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాలు చేపట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన పచ్చ జెండా ఊపారు. దాంతో సీమాంధ్ర నేతలు నిరాహార దీక్షలు చేస్తున్నారు, బస్సు యాత్ర చేపట్టారు. తెలంగాణ పార్టీ నేతలు చంద్రబాబు వ్యూహంపై అతి విశ్వాసంతో తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును, కాంగ్రెసు వైఖరిని తప్పు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తెలుగుదేశం నాయకులపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుపై వ్యతిరేకత కూడా అధికంగానే ఉంటుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబు ఆ ప్రాంతాల నాయకులను రెచ్చగొడుతున్నారని, వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని భావించే అవకాశాలున్నాయి. అందువల్ల చంద్రబాబు ఆశించినట్లుగా తెలంగాణలో పార్టీ బలంగా ఉండే అవకాశం లేదు.
ఇక, సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మాదిరిగా చంద్రబాబు ముందుకు రాకపోవడం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు అసంతప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపుతుంది. తెలుగుదేశం నాయకులు ఎంత ఉధృతంగా ఆందోళనలు చేపట్టడానికి ప్రయత్నించినా అంతగా ఫలితాలు వస్తాయని ఆశించలేం. పైగా, శాసనసభలో తీర్మానం పెడితే బలపరుస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. చంద్రబాబు, చిరంజీవి వంటి ప్రతిపక్ష నాయకులు తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించడం వల్ల వారిపై నమ్మకంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, తీరా ప్రకటనే చేశాక మోసం చేశారని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. సమైక్యాంధ్రవాదులకు చంద్రబాబు వల్లనే ఇంత దాకా పరిస్థితి వచ్చిందని కాంగ్రెసు నాయకులు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు అప్పుడో మాట చెప్పి ఇప్పుడో మాట చెబుతున్నాయని తెలంగాణ ప్రజలకు చెబుతున్నారు. దీని వల్ల చంద్రబాబు విశ్వసనీయత మరింత ప్రమాదంలో పడింది. చంద్రబాబుపై ఇది కోస్తాంధ్ర, రాయలసీమల్లో వ్యతిరేకంగా పనిచేస్తుంది.
అయితే, చంద్రబాబు ఉద్దేశం వేరుగా ఉంది. రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడినందున మధ్యంతర ఎన్నికలు రావడానికి వీలైన పరిస్థితిని కల్పించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ పరిస్థితి పూర్తిగా తిరగబడే అవకాశం ఉంది. ఇది చంద్రబాబును రాజకీయంగా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. గోడ మీది పిల్లివాటం, రెండు పడవల్లో ప్రయాణం ఎప్పటికైనా మంచిది కాదు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications