నువ్వా నేనా?

తిరిగి అధికారం మాదేనని వైయస్ రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండగా, అధికారం మాదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. రాష్ట్రంలో నిశబ్ద విప్లవం వస్తుందని, ఓటర్లు తమకే పట్టం కడుతారని చిరంజీవి చెబుతూ వచ్చారు. అయితే చిరంజీవి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి తగిన సీట్లను సాధించుకోలేరని గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి. పోటీ చంద్రబాబుకు, వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్యనే ఉండే అవకాశాలున్నాయి. అయితే ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ రాదని, ఈ స్థితిలో చిరంజీవి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారనే మాట కూడా వినిపిస్తుంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహా కూటమి ఆధిక్యత సాధిస్తుందని అంటున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 154 అసెంబ్లీ స్థానాల్లో 90 దాకా గెలుచుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చిరంజీవి పాగా వేసినట్లు భావిస్తున్నారు. మిగతా కోస్తా జిల్లాల్లో మూడు పార్టీలు కూడా సీట్లను పంచుకుంటాయని అంటున్నారు. రాయలసీమలో కాంగ్రెసుకు కొద్దిపాటి ఆధిక్యత మాత్రమే వస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు, రాజశేఖర రెడ్డికి మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications