జగన్ పార్టీలోకి మరింత మంది ఎంపీలు?

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ పదవి దక్కకపోవడంతో రాయపాటి సాంబశివరావు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో ఉఁడాలో లేదో తన నియోజకవర్గం కార్యకర్తలే తేలుస్తారని ఆయన చెప్పారు. అలా పదవులు ఆశిస్తున్నవారు కాంగ్రెసు పార్టీలో చాలా మందే ఉన్నారు. కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రి పదవులు ఆశించారు. కానీ వారికి ఆ అవకాశం దక్కే పరిస్థితి లేదు. పైగా, ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగింది.
కాంగ్రెసు పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో దగ్గుబాటి పురంధేశ్వరి ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవు. దీంతో తమకు ఎలాగూ మంత్రి పదవులు దక్కవనే నిర్ణయానికి కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావు వచ్చినట్లు చెబుతున్నారు.
మరో వైపు, రాష్ట్ర కాంగ్రెసులో కాపుల ప్రాబల్యం పెరుగుతోంది. చిరంజీవి, బొత్స సత్యనారాయణ వంటి నాయకులు రాష్ట్రంలో కాంగ్రెసు భవిష్యత్తును నిర్ణయించడానికి సిద్ధపడ్డారు. సీమాంధ్రలో కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య వైరం నడుస్తూ ఉంటుంది. ఈ స్థితిలో సరైన ప్రాతినిధ్యం లభించని సామాజిక వర్గం జగన్ పార్టీ వైపు చూసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications