కెసిఆర్ది తప్పించుకునే ప్రయత్నమా?

తెలంగాణ కోసమే ఉద్యమిస్తున్నామని, తెలంగాణ కోసం ప్రాణత్యాగానికే సిద్ధపడ్డానని చెబుతున్న కెసిఆర్ రాజాం పెద్ద వ్యాపారి అని ఆయనకు ఎక్కెడెక్కడ కాంట్రాక్టులు ఉన్నాయో తనకు తెలియాల్సిన అవసరం లేదని చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే పోలవరం టెండర్లు రాజాం పెట్టుబడులు పెట్టిన ష్యూ కంపెనీకి దక్కేందుకు టిఆర్ఎస్ అగ్ర నేతలు తెరచాటు ప్రయత్నాలు చేశారో లేదో చెప్పలేదని అలాగే టెండర్ల కోసం సమ్మెను తాకట్టు పెట్టిన అంశంపై కూడా ఆయన సమాధానం చెప్పలేదని అంటున్నారు. కెసిఆర్ వేటికి సమాధానాలు చెప్పకుండా దాటవేసే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుపై నమస్తే తెలంగాణ పత్రికలో ప్రముఖంగా వార్త వస్తే కెసిఆర్ అది తనకు తెలియదని దానిపై నమస్తే తెలంగాణ సంపాదకుడిని అడగాలని, అయినా వార్తను వార్తగా రాయటంలో తప్పేమిటని చెప్పడం తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోందంటున్నారు. టెండర్లు ఎలా వేస్తారో తనకు తెలియదన్న వ్యాఖ్యలను కూడా వారు తప్పు పడుతున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో స్వచ్ఛంగా ఉన్నానన్న కెసిఆర్ తన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎందుకు ప్రకటించటం లేదని ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ పోలవరం విషయంలో తమ సవాళ్లకు స్పందించకుండా తప్పుడు ఆరోపణలు చేసి ఉద్దేశ్య పూర్వకంగా ఇష్యూ నుండి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications