కిరణ్ కుమార్ రెడ్డి సహనం కోల్పోవడం వెనక..

పరిస్థితిలో మార్పు లేకపోగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చిన చిరంజీవి అదును చూసి అధికారానికి చేరువ కావాలని కాచుకుని కూర్చున్నారు. బొత్స సత్యనారాయణ, చిరంజీవి కలిసి తనక పదవికి ఎసరు పెడతారనే భయం కూడా ఆయనను కలిచివేస్తున్నట్లు చెబుతున్నారు. అస్థిరత కొట్టుమిట్టాడుతోంది.
ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వ్యవహరించిన తీరు, గురువారం సాయంత్రం కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో వ్యవహరించిన తీరు ఆయన సహనం కోల్పోతున్నారని చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు. సకల జనుల సమ్మెను విరమించాలని చెప్పడానికి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన గమ్మత్తుగా వ్యవహరించారు. తాను మాట్లాడడం ముగించిన తర్వాత మీడియా ప్రతినిధులను ప్రశ్నలు వేయనీయలేదు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోడం వేరైతే ప్రశ్నలనే అహ్వానించడానికి నిరాకరించారు. మీరేదో అడుగుతారు, నేను మాట్లాడిన విషయాలకు పెడర్థాలు తీస్తారు, అందువల్ల ప్రశ్నలను తీసుకోదలుచుకోలేదు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆ విధంగా అనడం నిజంగా ఆశ్చర్యకరమే.
కాగా, గురువారం సాయంత్రం కాంగ్రెసు తెలంగామ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్పై చేసిన వ్యాఖ్యలు కిరణ్ కుమార్ రెడ్డికి తగినవేమో గానీ ఓ ముఖ్యమంత్రికి తగినవి కావనే మాట అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వైపుల నుంచీ విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు వస్తుంటాయి. పైగా, ఆందోళనలు చెలరేగుతున్నప్పుడు అవి ఎక్కువగా వస్తాయి. పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడారని దురుసుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం స్థాయిని తగ్గించుకోవడమే. హుందాగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి సహనం కోల్పోయారు.












Click it and Unblock the Notifications